News August 16, 2024

మండలానికో అన్న క్యాంటీన్: చంద్రబాబు

image

AP: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో మండలానికో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే అన్న క్యాంటీన్లను ట్రస్ట్ ద్వారా శాశ్వతంగా కొనసాగిస్తామని ప్రకటించారు. కాగా రాష్ట్రంలో ఇవాళ మరో 99 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. వీటిని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.

Similar News

News January 23, 2026

భీమవరం: ఇసుక కొరత ఏర్పడకూడదు.. కలెక్టర్ ఆదేశం

image

పెదఅమిరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన శుక్రవారం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం కమిటీ సభ్యులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఇసుక కొరత ఏర్పడకుండా అవసరమైన స్టాకును ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. 1,32,954 మెట్రిక్ టన్నుల ఇసుక సిద్ధంగా ఉందన్నారు.

News January 23, 2026

సునీతా విలియమ్స్ పెన్షన్ ఎంతో తెలుసా?

image

27 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్ తర్వాత రిటైర్ అయిన సునీతా విలియమ్స్‌కు ఏడాదికి దాదాపు ₹36 లక్షల పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. FERS ద్వారా అందే ఈ పెన్షన్‌తో పాటు, అమెరికా సోషల్ సెక్యూరిటీ స్కీమ్ నుంచి అదనపు నెలవారీ ఆదాయం కూడా లభిస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, TSP ఇన్వెస్ట్‌మెంట్ సేవింగ్స్ వంటి బెనిఫిట్స్ అందుతాయి. నాసా నుంచి ప్రత్యేక మెడికల్ సపోర్ట్ కొనసాగుతుంది.

News January 23, 2026

దగ్గుబాటి సోదరులపై కోర్టు సీరియస్

image

TG: ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్‌ కూల్చివేత కేసులో దగ్గుబాటి సురేశ్, వెంకటేశ్, రానాపై నాంపల్లి కోర్టు ఆగ్రహించింది. ఎన్నిసార్లు కోర్డు ఆర్డర్స్ ధిక్కరిస్తారని ప్రశ్నించింది. సెలబ్రిటీలకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని వ్యాఖ్యానించింది. ఎన్నిసార్లు తప్పించుకొని తిరుగుతారని మండిపడింది. FEB 5న కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరవ్వాలని, లేదంటే నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామంది.