News April 10, 2024
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా మండవ?

TG: ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు ఖరారైనట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవకు.. సీఎం రేవంత్ ఒకప్పుడు సన్నిహితుడు. దీంతో ఆయన అభ్యర్థిత్వానికి అధిష్ఠానం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నెల 12న దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. మరోవైపు స్థానికేతరుడికి ఎలా టికెట్ ఇస్తారంటూ కొంత మంది నేతలు ప్రశ్నిస్తున్నట్లు టాక్.
Similar News
News January 5, 2026
రెచ్చిపోతున్న అమెరికా.. UNO ఎందుకు ఉందో?

ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలను నివారించడం, అంతర్జాతీయ చట్టాలను అమలు పరిచేందుకు 1945లో ఐక్యరాజ్యసమితి ఏర్పడిందని చిన్నప్పుడు ఎంతో గొప్పగా చదువుకున్నాం. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా.. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని లెక్క చేయకుండా దాడులకు పాల్పడుతోంది. ఏకంగా దేశాధ్యక్షుడినే ఎత్తుకుపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ UNO ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.
News January 5, 2026
కొలెస్ట్రాల్ పెరిగితే ఈ లక్షణాలు కనిపిస్తాయి

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. దీన్ని మనం ముందుగానే గమనించలేము. అయితే కొన్నిలక్షణాలతో దీన్ని ముందుగానే గుర్తించొచ్చంటున్నారు నిపుణులు. ఛాతీ నొప్పి, కాళ్ళలో నొప్పి, తిమ్మిరి, చర్మ మార్పులు, తలతిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, వాపు, హృదయ స్పందన రేటులో మార్పులు, దవడ నొప్పి, మెడ వెనుక భాగంలో నొప్పి వంటివి అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు.
News January 5, 2026
ఒంటరితనం ఒక స్లో పాయిజన్!

‘ఒంటరి వాడిని నేను..’ అంటూ గర్వంగా చెబుతున్నారా? అయితే ఇది మీకోసమే. ఇలా ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా జీవించేవారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చొని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఒంటరిగా ఉంటే రోగనిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్లు త్వరగా సోకుతాయి. ముఖ్యంగా ఒత్తిడి హార్మోన్లు పెరిగి వైరస్లతో పోరాడే సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులకు & దీర్ఘకాలిక వాపులకు దారితీస్తుంది. SHARE IT


