News September 6, 2024

మణిపుర్: మొన్న డ్రోన్.. నేడు రాకెట్ బాంబులతో దాడి

image

మణిపుర్‌లోని బిష్ణుపుర్ జిల్లాలో మిలిటెంట్లు ఉదయం బాంబులతో దాడి చేశారు. పక్కనే ఎత్తుమీదున్న చురాచంద్‌పుర్ జిల్లాలోని కొండప్రాంతం నుంచి జనావాసమైన ట్రాంగ్‌లావోబీ లక్ష్యంగా రాకెట్లు ప్రయోగించారు. అవి కనీసం 3 కి.మీ దాటొచ్చాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రాణ నష్టమేమీ జరగలేదని, కమ్యూనిటీ హాల్, ఖాళీ గది ధ్వంసమయ్యాయని తెలిపారు. ఇప్పటికే ఇంఫాల్‌లో డ్రోన్ బాంబు దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Similar News

News November 12, 2025

ఢిల్లీ పేలుడు.. ఆ టెర్రరిస్టుకు మరో కారు?

image

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలిన హ్యుందాయ్ i20 కారుతో పాటు మరో కారు <<18256986>>టెర్రరిస్టుకు <<>>ఉన్నట్లు తెలుస్తోంది. అతడు ఇంకో వాహనాన్ని కూడా ఉపయోగించాడని నిఘా వర్గాలు అలర్ట్ చేసినట్లు సమాచారం. దీంతో ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్ పోలీసు బృందాలు Ford కంపెనీకి చెందిన EcoSport రెడ్ కలర్ కారు కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. ఉమర్ నబీ పేరుతో ఆ కారు(DL10CK0458) ఉన్నట్లుగా జాతీయ మీడియా వెల్లడించింది.

News November 12, 2025

రోహిత్ టార్గెట్.. ఫిట్‌నెస్, 2027 వరల్డ్ కప్!

image

2027 ODI వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కించుకోవాలని రోహిత్ శర్మ గట్టి పట్టుదలతో ఉన్నారు. డిసెంబర్ 24 నుంచి జరిగే విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఆడనున్నట్టు ప్రకటించడం అందుకేనని విశ్లేషకులు చెబుతున్నారు. వన్డే స్క్వాడ్‌లో చోటు దక్కాలంటే డొమెస్టిక్ క్రికెట్ తప్పక ఆడాల్సిందేనని BCCI రూల్ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే బరువు తగ్గిన హిట్‌మ్యాన్.. ప్రపంచకప్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

News November 12, 2025

ఐరన్, క్యాల్షియం ట్యాబ్లెట్లు ఎలా తీసుకోవాలంటే?

image

హిమోగ్లోబిన్‌ తయారీలో ఐరన్‌, ఎముకలు బలంగా ఉండటానికి క్యాల్షియం అత్యవసరం. అందుకే గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు, నెలసరి నిలిచిన మహిళలు వీటిని తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. అయితే ఈ రెండిటినీ ఒకేసారి తీసుకుంటే శరీరం ఐరన్‌ను గ్రహించుకోకుండా క్యాల్షియం అడ్డుపడుతుంది. ఐరన్‌ పరగడుపున బాగా ఒంట పడుతుంది కాబట్టి భోజనానికి ముందు తీసుకుంటే మంచిది. క్యాల్షియాన్ని భోజనంతో పాటు తీసుకోవచ్చు.