News December 27, 2024
మన్మోహన్ ఫ్యామిలీ వివరాలు

మన్మోహన్ 1958లో గుర్శరన్ కౌర్ను వివాహం చేసుకున్నారు. ఈమె ప్రొఫెసర్, రచయిత. వీరికి ముగ్గురు కూతుళ్లు ఉపీందర్, దమన్, అమృత్ సింగ్ ఉన్నారు. ఉపీందర్ అకోలా వర్సిటీ డీన్, హిస్టరీ ప్రొఫెసర్, ఢిల్లీ వర్సిటీలో హిస్టరీ HODగా పనిచేశారు. ఈమె 6 పుస్తకాలు రాశారు. దమన్ అనేక నవలలు రాశారు. NATGRID సీఈవోగా పనిచేశారు. అమృత్ ACLUలో స్టాఫ్ అటార్నీగా సేవలందిస్తున్నారు. మన్మోహన్ అల్లుళ్లు ఉన్నతస్థానాల్లో ఉన్నారు.
Similar News
News February 6, 2026
SACONలో 36 పోస్టులు… అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ(SACON)లో 36పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్డీ, పీజీ, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, EWSలకు రూ.100. వెబ్సైట్: www.sacon.in
News February 6, 2026
‘యుఫోరియా’ సినిమా రివ్యూ&రేటింగ్

యువత డ్రగ్స్కు అలవాటు పడితే ఏం జరుగుతుంది? ఆ మత్తులో చేసే అకృత్యాల వల్ల జీవితాలు ఎలా మారిపోతాయనేదే స్టోరీ. భూమిక, సారా నటన, యూత్ను ఆలోచింపజేసే అంశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ మెప్పిస్తుంది. కథను ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు గుణశేఖర్ తడబడ్డారు. సెకండాఫ్ స్క్రీన్ ప్లే కన్ఫ్యూజింగ్గా ఉంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీయడంతో కొన్ని సీన్లు ఊహించేలా ఉంటాయి. మ్యూజిక్ ఫర్వాలేదు.
రేటింగ్: 2.25/5
News February 6, 2026
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల నష్టంతో 25,535 వద్ద, సెన్సెక్స్ 300 పాయింట్లు తగ్గి 83,000 వద్ద ట్రేడ్ అవుతోంది. నేడు RBI మానిటరీ పాలసీ ప్రకటన ఉండటంతో పెట్టుబడిదారులు దానికోసం వేచిచూస్తున్నారు. మరోవైపు అమెరికా సహా పలు గ్లోబల్ మార్కెట్లు సైతం నష్టాల్లో ఉండటం దేశీయంగా ప్రభావం చూపిస్తోంది. దీంతో మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.


