News December 30, 2024
మన్మోహన్ ఎందరికో మార్గదర్శి: రేవంత్

TG: దేశ నిర్మాణం కోసం మన్మోహన్ సింగ్ ఎన్నో నిర్మాణాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారని సీఎం రేవంత్ వెల్లడించారు. ఉపాధి హామీ, RTI, NRHM, ఆధార్ను ఆయన ప్రారంభించారని తెలిపారు. 2013లో భూసేకరణ చట్టం తెచ్చి నిరుపేదలను, 2006లో అటవీహక్కుల చట్టానికి సవరణలు చేసి ఆదివాసీలను ఆదుకున్నారని కొనియాడారు. ఐటీ రంగంలో ప్రస్తుతం దేశం శాసించగలుగుతోందంటే మన్మోహన్ విధానాలే కారణమన్నారు.
Similar News
News December 11, 2025
పార్లమెంటులో అమరావతి బిల్లు ప్రవేశపెడతాం: పెమ్మసాని

AP: అమరావతిని శాశ్వత రాజధాని చేసేలా పార్లమెంటులో ప్రస్తుత, లేదా వచ్చే సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. ‘రాజధానిగా 2014 నుంచా? లేక ఇప్పటి నుంచి గుర్తించాలా? అనే సాంకేతిక కారణంతో బిల్లు ఆలస్యమైంది. CBN మానిటర్ చేస్తున్నారు. అనేక సంస్థలు ఇప్పటికే కొలువుదీరుతున్నాయి. BILLపై విషం కక్కుతున్న జగన్ను రాజకీయ సమాధి చేయాలి. AP భవిష్యత్ను నాశనం చేశారు’ అని దుయ్యబట్టారు.
News December 11, 2025
విషాదం.. ఫ్రిజ్ పేలి తల్లి, కొడుకు మృతి

TG: ఫ్రిజ్ పేలి తల్లి, కొడుకు మృతిచెందిన ఘటన గద్వాల(D) ధరూర్లో జరిగింది. ఓ ఇంట్లో 2 రోజుల క్రితం ఫ్రిజ్ పేలగా ఇద్దరు మహిళలు, ఓ బాలుడు గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఓ మహిళ, ఆమె కొడుకు చనిపోయారు. కాగా ఫ్రిజ్ను గోడకు 15-20cm దూరంలో ఉంచడం, క్లీన్ చేయడం, సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం, వైరింగ్, ప్లగ్స్ చెక్ చేయడం వంటి జాగ్రత్తలతో ఇలాంటి ఘటనలు నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
News December 11, 2025
BELలో అప్రెంటిస్ పోస్టులు.. నేటి నుంచే దరఖాస్తుల ఆహ్వానం

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (<


