News December 30, 2024

మన్మోహన్ ఎందరికో మార్గదర్శి: రేవంత్

image

TG: దేశ నిర్మాణం కోసం మన్మోహన్ సింగ్ ఎన్నో నిర్మాణాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారని సీఎం రేవంత్ వెల్లడించారు. ఉపాధి హామీ, RTI, NRHM, ఆధార్‌ను ఆయన ప్రారంభించారని తెలిపారు. 2013లో భూసేకరణ చట్టం తెచ్చి నిరుపేదలను, 2006లో అటవీహక్కుల చట్టానికి సవరణలు చేసి ఆదివాసీలను ఆదుకున్నారని కొనియాడారు. ఐటీ రంగంలో ప్రస్తుతం దేశం శాసించగలుగుతోందంటే మన్మోహన్ విధానాలే కారణమన్నారు.

Similar News

News February 5, 2025

ఢిల్లీలో కాంగ్రెస్‌కు శూన్య హస్తమేనా?

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మెజారిటీ సంస్థలు BJPకి, మరికొన్ని ఆప్‌కు అధికారం దక్కుతుందని తెలిపాయి. కాగా, దాదాపు అన్ని సర్వేల్లోనూ కాంగ్రెస్‌ ఖాతా తెరవదని చెప్పాయి. 0-3 సీట్లకే ఛాన్స్ ఉందని ఒకట్రెండు తెలిపాయి. దీంతో ఢిల్లీలో కాంగ్రెస్ పని ఖతమైనట్లే అని, ఆప్‌తో పొత్తు పెట్టుకోవాల్సిందని రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు.

News February 5, 2025

రేపు జగన్ ప్రెస్‌మీట్

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడతారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, ప్రజా సమస్యలపై ఆయన ప్రసంగిస్తారు. కాగా ఇవాళ విజయవాడ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో జగన్ కూటమి సర్కార్‌పై ఫైర్ అయ్యారు. ఈసారి జగనన్న 2.0 వేరే లెవెల్‌లో ఉంటుందని కూటమి సర్కార్‌ను ఆయన హెచ్చరించారు.

News February 5, 2025

పీవోకేలో అడుగుపెట్టిన హమాస్!

image

కశ్మీర్ సాలిడారిటీ డేలో పాల్గొనేందుకు పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు హమాస్ లీడర్ ఖలీద్ అల్ ఖదౌమీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్‌లో జైషే (Jaish-e – జైషే) మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు తల్హా సైఫ్‌తో కలిసి ఖలీద్ పాల్గొన్నట్లు సమాచారం. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైలెవెల్ మీటింగ్ నిర్వహించారు. భద్రతా చర్యలు తీవ్రతరం చేయాలని ఆ రాష్ట్ర పోలీసులను ఆదేశించారు.

error: Content is protected !!