News September 26, 2024

మన్మోహన్ సింగ్ @ 92: మోదీ, రాహుల్ విషెస్

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు PM మోదీ, LoP రాహుల్ సహా ప్రముఖులు బర్త్‌డే విషెస్ తెలిపారు. ‘మాజీ పీఎం, డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు బర్త్‌డే విషెస్. మీరు సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే మన్మోహన్ సింగ్‌. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మీ నిస్వార్థ సేవ, వినయం, విజ్ఞానం కోట్లాది భారతీయుల్లో స్ఫూర్తి నింపుతున్నాయి’ అని రాహుల్ Xలో పోస్టు చేశారు.

Similar News

News December 19, 2025

అమిత్ షాతో చంద్రబాబు భేటీ

image

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల పురోగతి, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇటీవల నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు వచ్చిన సానుకూల స్పందనను వివరించారు. అంతకుముందు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన సీఎం.. అమరావతి ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని, హైవే నెట్‌వర్క్‌లతో రాజధానిని కనెక్ట్ చేయాలని కోరారు.

News December 19, 2025

సొసైటీ పాలకవర్గాలు రద్దు.. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు

image

TG: రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(PACS) పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు 9 జిల్లాల DCCB పాలకమండళ్లను సైతం తొలగించింది. ఇప్పటికే 2 సార్లు వీటి పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు PACSలకు పర్సన్ ఇన్‌ఛార్జులను నియమించి, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వీరిని కొనసాగించాలని పేర్కొంది. త్వరలోనే సొసైటీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

News December 19, 2025

విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్న విరాట్, రోహిత్

image

భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఆడనున్నారు. విరాట్ కోహ్లీ, పంత్, ఇషాంత్ శర్మ, నవదీప్ సైనీ తమ జట్టు తరఫున ఆడతారని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. అటు ఈ టోర్నమెంట్‌లో తొలి రెండు మ్యాచుల్లో రోహిత్ శర్మ ఆడనున్నారని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు వెల్లడించారు. డిసెంబర్ 24 నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది.