News August 20, 2024
మన్మోహన్ సింగ్ది కూడా లేటరల్ ఎంట్రీనే: కేంద్ర మంత్రి

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1976లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా లేటరల్ ఎంట్రీ ద్వారా నియమితులయ్యారని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గుర్తు చేశారు. RSSకి చెందిన వారిని ప్రభుత్వ శాఖల్లో నియమిస్తున్నారన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలను ఆయన తిప్పికొట్టారు. నిబంధనలు రూపొందించే బాధ్యతను UPSCకి ఇచ్చి లేటరల్ ఎంట్రీ విధానాన్ని ప్రధాని మోదీ క్రమబద్ధీకరించారని మంత్రి పేర్కొన్నారు.
Similar News
News July 8, 2025
US కొత్త చట్టం.. పెరగనున్న వీసా ఫీజులు

US ప్రెసిడెంట్ ట్రంప్ కొత్తగా తీసుకొచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్’తో వీసా ఫీజులు పెరగనున్నాయి. నాన్ ఇమిగ్రెంట్లు తప్పనిసరిగా వీసా జారీ సమయంలో ఇంటిగ్రిటీ ఫీజు కింద $250 చెల్లించాలి. భవిష్యత్ నిబంధనలకు అనుగుణంగా ఇది పెరగొచ్చు. 2026 నుంచి కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా ఈ మొత్తం ఏటా పెరుగుతూ ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఫీజును తగ్గించడం లేదా రద్దు చేయడానికి వీలుండదు.
News July 8, 2025
‘నవోదయ’లో ప్రవేశాలకు కొన్ని రోజులే గడువు

2026-27 విద్యాసంవత్సరానికి 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో క్లాసులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. జులై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదో తరగతి పూర్తయినవారు, ఈ ఏడాది అదే క్లాసు చదువుతున్నవారు అర్హులు. AP, TG సహా పలు రాష్ట్రాల్లో డిసెంబర్ 13న, పర్వత ప్రాంత రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 11న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. cbseitms.rcil.gov.in/nvs వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News July 8, 2025
18 రోజుల్లో కుబేర కలెక్షన్లు ఎంతంటే?

నాగార్జున, ధనుష్, రష్మిక కాంబోలో వచ్చిన ‘కుబేర’ సినిమా మిక్స్డ్ టాక్తో థియేటర్లలో రన్ అవుతోంది. గత నెల 20న రిలీజైన ఈ మూవీ వారంలోనే రూ.100కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు మూవీ టీం ప్రకటించింది. ఆ తర్వాత పలు సినిమాలు రిలీజ్ కావడంతో కలెక్షన్లు తగ్గాయి. సినిమా రిలీజై నేటికి 18 రోజులు కాగా, ప్రపంచ వ్యాప్తంగా రూ.134.25 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.