News December 27, 2024

రాజ్ ఘాట్ సమీపంలో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు ఢిల్లీలోని రాజ్ ఘాట్ సమీపంలో నిర్వహించనున్నారు. ఇవాళ ఆయన భౌతికదేహాన్ని నివాసంలోనే సందర్శనార్థం ఉంచారు. రేపు ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

Similar News

News December 18, 2025

ఫలితాలు విడుదల

image

TG: గ్రూప్-3 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 1,370 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు తెలిపింది. అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇటీవల సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఒక పోస్ట్ వెరిఫికేషన్ కోసం పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. మరో 17 పోస్టుల వివరాలు త్వరలో వెల్లడిస్తామంది. లిస్ట్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News December 18, 2025

22న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

image

AP: జనసేన బలోపేతంపై ఆ పార్టీ చీఫ్, Dy.CM పవన్ కళ్యాణ్ దృష్టిసారించారు. ఇందులో భాగంగా నామినేటెడ్ పదవులు పొందిన నేతలతో ఈ నెల 22న విస్తృత సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు. ‘పదవి-బాధ్యత’ పేరుతో మంగళగిరిలో జరిగే ఈ భేటీలో నాయకులకు ఆయన దిశానిర్దేశం చేస్తారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, MLAలు, MLCలు, MPలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, జిల్లా స్థాయి పదవుల్లో ఉన్నవారు హాజరుకావాలని ఆదేశించారు.

News December 18, 2025

ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

image

తెలుగు రాష్ట్రాల్లో చలి, పొగమంచు తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రజలు ఉదయం బయట అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు. TGలో 2-3 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, కామారెడ్డి, వరంగల్, వికారాబాద్ జిల్లాలకు YELLOW ALERT ఇచ్చింది. అటు APలోని మన్యంలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి.