News December 27, 2024

మన్మోహన్ సహకారం మరువలేనిది: KCR

image

TG: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల BRS అధినేత KCR సంతాపం తెలియజేశారు. తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు మన్మోహన్ అందించిన సహకారం మరువలేనిదని కొనియాడారు. ‘తెలంగాణ కోసం పోరాడిన ప్రతి సందర్భంలో మనోధైర్యం నింపారు. ఆయన ప్రధానిగా ఉండగానే రాష్ట్రం ఏర్పడింది. మన్మోహన్‌కు ఘన నివాళులు’ అని KCR పేర్కొన్నారు. అటు రేపు జరిగే ఆయన అంత్యక్రియల్లో పాల్గొనాలని KTR సహా పార్టీ నేతలను KCR ఆదేశించారు.

Similar News

News December 24, 2025

అతిథికి రెడ్ కార్పెట్.. మనోళ్లకు రైలు టాయిలెట్!

image

అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ కోసం రూ.89కోట్లు ఖర్చు చేస్తే.. మన క్రీడాకారులు రైలు టాయిలెట్ <<18652348>>పక్కన<<>> నరకయాతన అనుభవించారు. భారత క్రీడారంగంలో వెలుగుచూసిన ఈ వివక్ష అందరినీ నివ్వెరపరుస్తోంది. గెలిచినప్పుడు భుజం తట్టే పాలకులు వారి ప్రయాణ కష్టాలను కూడా పట్టించుకోరా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మెడలో మెడల్స్ కోరుకునే వ్యవస్థ క్రీడాకారుల ఆత్మగౌరవాన్ని పట్టించుకోదా? దీనిపై మీరేమంటారు? COMMENT

News December 24, 2025

VHT: ఒకే రోజు 22 సెంచరీలు

image

విజయ్ హజారే ట్రోఫీలో తొలి రోజు ఆటగాళ్లు శతకాల మోత మోగించారు. ఇవాళ ఏకంగా 22 మంది ప్లేయర్లు సెంచరీలు చేశారు. ఒడిశా ప్లేయర్ స్వస్తిక్ ఏకంగా డబుల్ సెంచరీ బాదారు. బిహార్ నుంచి వైభవ్ సహా ముగ్గురు ప్లేయర్లు శతకాలు చేశారు. స్టార్ ప్లేయర్లు కోహ్లీ, రోహిత్‌తో పాటు ఇషాన్ కిషన్ ఈ లిస్ట్‌లో ఉన్నారు. కాగా బిహార్ ప్లేయర్ గని 32 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీతో సరికొత్త రికార్డు నమోదు చేశారు.

News December 24, 2025

సిల్వర్ ఈజ్ ది న్యూ గోల్డ్.. ‘యాపిల్’ను వెనక్కు నెట్టి!

image

2025లో వెండి ధరలు రికార్డు స్థాయిలో పుంజుకుంటున్నాయి. అటు ఆర్థిక నిల్వగా, ఇటు పారిశ్రామిక లోహంగా వెండికి ఆదరణ పెరుగుతుండటమే దీనికి ప్రధాన కారణం. తాజా లెక్కల ప్రకారం వెండి మార్కెట్ విలువ సుమారు $4.04 ట్రిలియన్లకు చేరుకుంది. దీంతో ‘APPLE’ కంపెనీ మార్కెట్ విలువ ($4.02 ట్రిలియన్లు)ను వెండి అధిగమించి మూడో స్థానానికి చేరింది. ఫస్ట్ ప్లేస్‌లో గోల్డ్ ($31.41T), రెండో స్థానంలో NVIDIA($4.61T) ఉంది.