News December 28, 2024

నేడు మన్మోహన్ అంత్యక్రియలు

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను ఇవాళ ఉదయం 11.45 గంటలకు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో జరగనున్నాయి. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. తొలుత మన్మోహన్ పార్థీవ దేహాన్ని ఆయన నివాసం నుంచి AICC కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు ఉంచి నిగమ్‌బోధ్ ఘాట్‌కు తీసుకెళ్తారు.

Similar News

News November 17, 2025

షేక్ హసీనాకు మరణశిక్ష

image

బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ (ICT) సంచలన తీర్పు ఇచ్చింది. ఢాకా అల్లర్ల కేసులో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. గతేడాది విద్యార్థుల ఆందోళనల సమయంలో 1400 మంది చావుకు కారణమయ్యారని ఆమెతో పాటు మరో ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఆమెను దోషిగా తేల్చిన కోర్టు తాజాగా మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రస్తుతం హసీనా భారత్‌లో తల దాచుకుంటున్నారు.

News November 17, 2025

షేక్ హసీనాకు మరణశిక్ష

image

బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ (ICT) సంచలన తీర్పు ఇచ్చింది. ఢాకా అల్లర్ల కేసులో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. గతేడాది విద్యార్థుల ఆందోళనల సమయంలో 1400 మంది చావుకు కారణమయ్యారని ఆమెతో పాటు మరో ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఆమెను దోషిగా తేల్చిన కోర్టు తాజాగా మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రస్తుతం హసీనా భారత్‌లో తల దాచుకుంటున్నారు.

News November 17, 2025

1,260 ఉద్యోగాలు.. సెలక్షన్ లిస్ట్ విడుదల

image

TG: 1,260 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల లిస్టును మెడికల్&హెల్త్ సర్వీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు 24,045 మంది దరఖాస్తు చేయగా, 23,323 మంది పరీక్ష రాశారు. కాగా స్పోర్ట్స్ కోటా సెలక్షన్ లిస్టును సెపరేట్‌గా రిలీజ్ చేస్తామని MHSRB వెల్లడించింది. వికలాంగుల కోటాలో దరఖాస్తుదారులు లేకపోవడంతో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది.
ఫలితాల కోసం <>క్లిక్<<>> చేయండి.