News December 28, 2024

నేడు మన్మోహన్ అంత్యక్రియలు

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను ఇవాళ ఉదయం 11.45 గంటలకు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో జరగనున్నాయి. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. తొలుత మన్మోహన్ పార్థీవ దేహాన్ని ఆయన నివాసం నుంచి AICC కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు ఉంచి నిగమ్‌బోధ్ ఘాట్‌కు తీసుకెళ్తారు.

Similar News

News November 14, 2025

కాంగ్రెస్‌కు కొత్త నిర్వచనం చెప్పిన PM మోదీ

image

ఇప్పుడున్న కాంగ్రెస్ MMCగా మారిందని బిహార్ విక్టరీ సెలబ్రేషన్స్‌లో ప్రధాని మోదీ విమర్శించారు. ‘MMC అంటే ముస్లింలీగ్ మావోవాది కాంగ్రెస్. ఇతర పార్టీల ఓట్లతో బతకాలని కాంగ్రెస్ చూస్తోంది. ఎన్నికలు వస్తే వేరే పార్టీలనూ ముంచేస్తోంది. ప్రజలకు ఆ పార్టీపై క్రమంగా విశ్వాసం పోతోంది’ అని వ్యాఖ్యానించారు. ఇక బిహార్‌లో ఆర్జేడీ MY(ముస్లిం, యాదవ్) ఫార్ములాను నమ్మితే తాము MY(మహిళా, యూత్)ను నమ్మినట్లు చెప్పారు.

News November 14, 2025

మళ్లీ తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఇవాళ ఒకేరోజు రెండు సార్లు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేట్ ఉదయం రూ.770 తగ్గగా తాజాగా రూ.810 దిగివచ్చింది. దీంతో రూ.1,27,040కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర ఉదయం రూ.700 తగ్గగా ఇప్పుడు రూ.750 తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,16,450గా నమోదైంది. అటు వెండి ధర కేజీపై 100 తగ్గి రూ.1,83,100కు చేరింది.

News November 14, 2025

తేజస్వీ విజయం.. తేజ్ ప్రతాప్ పరాజయం

image

బిహార్ ఎన్నికల్లో మహా కూటమి CM అభ్యర్థి, RJD నేత తేజస్వీ యాదవ్ గెలిచారు. రాఘోపూర్ నియోజకవర్గంలో BJP నేత సతీశ్ కుమార్‌పై 14,532 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మరోవైపు మహువా నియోజకవర్గంలో తేజస్వీ సోదరుడు, JJD చీఫ్ తేజ్ ప్రతాప్(-51,938 ఓట్లు) మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. రామ్‌విలాస్ అభ్యర్థి సంజయ్ కుమార్ సింఘ్ 44 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. రెండో స్థానంలో RJD అభ్యర్థి ముకేశ్ కుమార్ నిలిచారు.