News October 4, 2025
పంచ భూతాలను శుద్ధి చేసే మంత్రం

‘ఓం నమ:శివాయ’ మంత్రాన్ని జపిస్తే.. మన శరీరాన్ని నిర్మించిన పంచ భూతాలు శుద్ధి అవుతాయి. మనలోని ప్రతి అణువు పవిత్రతను సంతరించుకుంటుంది. శరీరాన్ని, ఆలోచనలను పరిశుభ్రం చేస్తుంది. ‘ఓం నమ:శివాయ’ అని పదేపదే స్మరించినప్పుడు మనలోని ప్రతి నాడీ ప్రభావితమవుతుంది. ఫలితంగా గందరగోళం, అలజడి దూరమవుతాయి. ప్రశాంతత దగ్గరవుతుంది. మనలోని తమోగుణం, రజోగుణాలు దూరమై సాత్విక భావం పెరుగుతుంది. <<-se>>#ShivaNaamaalu<<>>
Similar News
News October 4, 2025
ఆటో డ్రైవర్ల కోసం కొత్త యాప్: చంద్రబాబు

AP: ఉబర్, ర్యాపిడోల పోటీని తట్టుకునేలా ఆటో డ్రైవర్లకు అండగా ఉండేందుకు కొత్త యాప్ తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. దీంతో ఎక్కడ ఉన్నా నేరుగా బుకింగ్స్ డ్రైవర్లకు వెళ్తాయని చెప్పారు. 24 గంటలు ఆటో స్టాండ్లో ఉండే పనిలేకుండా చేస్తామన్నారు. అవసరమైతే ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు తీసుకొస్తామన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, యాప్ నిర్వహణ డ్రైవర్లు చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
News October 4, 2025
పీరియడ్స్ పెయిన్ రిలీఫ్ కోసం డివైజ్

నెలసరిలో చాలామంది మహిళలకు పొత్తికడుపు, నడుము నొప్పి ఎక్కువగా వస్తుంది. వీరికోసం వచ్చిందే ఈ పీరియడ్స్ పెయిన్ రిలీఫ్ డివైజ్. దీన్ని నడుము దగ్గర ధరించాలి. దీనికి రెండు ప్యాచ్లు ఉంటాయి. పొత్తికడుపు దగ్గర రెండు ప్యాచ్లు స్టిక్ చేసి, డివైజ్కు ఉన్న పవర్ బటన్ను నొక్కాలి. మీకు బాగా నొప్పిగా ఉంటే దాన్ని బట్టి హీట్ సర్దుబాటు చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. ఇది నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
News October 4, 2025
INDvsWI: ఫస్ట్ టెస్ట్ మనదే

వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఇన్నింగ్స్& 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్సులో విండీస్ 146 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు జడేజా 4, సిరాజ్ 3, కుల్దీప్ 2 వికెట్లతో చెలరేగారు. అంతకుముందు తొలి ఇన్నింగ్సులో విండీస్ 162 రన్స్ చేయగా భారత జట్టు 448/5(D) పరుగులు చేసింది. ముగ్గురు భారత ప్లేయర్లు సెంచరీలు చేశారు. రెండో టెస్టు 10 నుంచి జరగనుంది.