News August 5, 2024
పతకాలతో ఐఫిల్ టవర్ వద్ద మను

పారిస్కు తలమానికమైన ఐఫిల్ టవర్ ఎదుట మనూ భాకర్ తన కాంస్య పతకాలతో తాజాగా ఫొటో దిగారు. ‘పిక్ ఆఫ్ ది డే’ అంటూ క్రీడాభిమానులు ఆ ఫొటోను షేర్ చేస్తున్నారు. పారిస్ ఒలింపిక్స్లో భారత్కు ఇప్పటి వరకు 3 కాంస్య పతకాలు రాగా వాటిలో రెండు మనూ భాకర్వే. 124 ఏళ్ల రికార్డు బద్దలుగొట్టిన ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. పలు బ్రాండ్లు ఆమెను తమ ప్రచారకర్తగా నియమించుకునేందుకు పోటీ పడుతున్నాయి.
Similar News
News December 17, 2025
నెల్లూరు కలెక్టర్కు CM ప్రశంస

అమరావతిలోని సచివాలయంలో బుధవారం CM చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అని CM చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. CM సూపర్ సిక్స్, సూపర్ హిట్ ప్రాజెక్ట్లో సక్సెస్ సాధించిన కలెక్టర్లను అభినందించారు. ఫైల్ క్లియరెన్స్లో 2వ స్థానం సాధించినందుకు హిమాన్షు శుక్లాను CM ప్రత్యేకంగా ప్రశంసించారు.
News December 17, 2025
‘సర్పంచ్’ రిజల్ట్స్.. ఒక్క ఓటుతో..

TG: మూడో విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లోనూ పలువురు అభ్యర్థులు ఒక్క ఓటుతో విజయం సాధించారు. భద్రాద్రి జిల్లా నలబండబోడులో కాంగ్రెస్ అభ్యర్థి ఝాన్సీపై బీఆర్ఎస్ అభ్యర్థి సింధు ఒక్క ఓటు తేడాతో గెలిచారు. మొత్తం 139 ఓట్లు పోలవ్వగా ఝాన్సీకి 69, సింధుకి 70 ఓట్లు వచ్చాయి. సంగారెడ్డి(D) బాణాపూర్లోనూ ఇదే రిజల్ట్ రిపీటైంది. శంకర్పై కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ ఒక్క ఓటు తేడాతో గెలిచారు.
News December 17, 2025
బర్త్డే విషెస్.. CBN, పవన్కు షర్మిల థాంక్స్

AP: పీసీసీ చీఫ్ షర్మిలకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ Xలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. షర్మిల ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని వారు ఆకాంక్షించారు. వారికి ధన్యవాదాలు చెబుతూ పీసీసీ చీఫ్ రిప్లై ఇచ్చారు. అటు వైసీపీ చీఫ్ జగన్ షర్మిలకు విషెస్ చెప్పకపోవడం గమనార్హం.


