News August 5, 2024

పతకాలతో ఐఫిల్ టవర్ ‌వద్ద మను

image

పారిస్‌కు తలమానికమైన ఐఫిల్ టవర్ ఎదుట మనూ భాకర్ తన కాంస్య పతకాలతో తాజాగా ఫొటో దిగారు. ‘పిక్ ఆఫ్ ది డే’ అంటూ క్రీడాభిమానులు ఆ ఫొటోను షేర్ చేస్తున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇప్పటి వరకు 3 కాంస్య పతకాలు రాగా వాటిలో రెండు మనూ భాకర్‌వే. 124 ఏళ్ల రికార్డు బద్దలుగొట్టిన ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. పలు బ్రాండ్లు ఆమెను తమ ప్రచారకర్తగా నియమించుకునేందుకు పోటీ పడుతున్నాయి.

Similar News

News December 20, 2025

ప్రెగ్నెన్సీలో కాళ్ల వాపులు ఎందుకొస్తాయంటే?

image

గర్భిణుల్లో రక్త హీనత ఉన్నా, రక్తపోటు పెరిగినప్పుడు తరచూ చాలా మంది కాళ్లలో వాపు వస్తుంది. గర్భసంచి, బేబీ బరువుతో కొన్నిసార్లు కాళ్లవాపు వస్తుంది. మెల్లగా కాకుండా ఒక్కరోజులోనే కాళ్లు బాగా వాచిపోవడం, నొక్కితే సొట్ట పడిన తర్వాత అది మళ్లీ మామూలు స్థితికి రావడానికి ఎక్కువ సమయం పడినప్పుడు జాగ్రత్త పడాలి. రెండుకాళ్లు కాకుండా ఒక కాలే వాస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

News December 20, 2025

స్టార్‌బక్స్‌ CTOగా భారత సంతతి వ్యక్తి ఆనంద్‌ వరదరాజన్

image

ప్రపంచ ప్రఖ్యాత కాఫీ స్టార్‌బక్స్‌ తమ కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా భారత సంతతికి చెందిన ఆనంద్‌ వరదరాజన్‌ను నియమించింది. ఆయన గతంలో 19 ఏళ్ల పాటు అమెజాన్‌లో పనిచేశారు. అక్కడ గ్లోబల్‌ గ్రోసరీ బిజినెస్‌కి టెక్నాలజీ అండ్ సప్లైచైన్‌ హెడ్‌గా పనిచేశారు. ఒరాకిల్‌లోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. IIT నుంచి అండర్‌గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన తరువాత పర్డ్యూ, వాషింగ్టన్‌ యూనివర్సిటీల నుంచి మాస్టర్స్‌ చేశారు.

News December 20, 2025

మేడిగడ్డ వ్యవహారం.. L&Tపై క్రిమినల్ కేసు!

image

TG: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక పనులు చేపట్టిన L&T సంస్థపై క్రిమినల్ కేసు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు ముందుకు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. L&Tపై క్రిమినల్ కేసుకు న్యాయశాఖ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. మేడిగడ్డ వైఫల్యానికి L&Tదే బాధ్యత అని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయనుంది.