News August 5, 2024

పతకాలతో ఐఫిల్ టవర్ ‌వద్ద మను

image

పారిస్‌కు తలమానికమైన ఐఫిల్ టవర్ ఎదుట మనూ భాకర్ తన కాంస్య పతకాలతో తాజాగా ఫొటో దిగారు. ‘పిక్ ఆఫ్ ది డే’ అంటూ క్రీడాభిమానులు ఆ ఫొటోను షేర్ చేస్తున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇప్పటి వరకు 3 కాంస్య పతకాలు రాగా వాటిలో రెండు మనూ భాకర్‌వే. 124 ఏళ్ల రికార్డు బద్దలుగొట్టిన ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. పలు బ్రాండ్లు ఆమెను తమ ప్రచారకర్తగా నియమించుకునేందుకు పోటీ పడుతున్నాయి.

Similar News

News December 10, 2025

పరువు హత్య కేసులో సంచలన విషయాలు

image

AP కృష్ణా జిల్లాకు చెందిన <<18523409>>శ్రవణ్<<>> సాయి(19) HYD శివారు మైసమ్మగూడలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. కొన్నాళ్లుగా టెన్త్ క్లాస్‌మేట్‌తో ప్రేమలో ఉన్నాడు. విషయం అమ్మాయి పేరెంట్స్‌కు తెలిసి హెచ్చరించారు. అయినా వినకపోవడంతో పెళ్లి గురించి మాట్లాడదామని అమ్మాయి తల్లి అతడిని ఇంటికి పిలిచింది. అక్కడ గొడవ జరగ్గా సాయిని బ్యాటుతో కొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు.

News December 10, 2025

సర్పంచ్ ఎన్నికలు.. ఓటుకు రూ.4,000!

image

రేపు ఉదయం 7 గంటలకు TGలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. దీంతో సర్పంచ్ అభ్యర్థులు ఓట్ల ప్రలోభాల్లో జోరు పెంచారు. రాత్రికి రాత్రే ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. ఓటుకు రూ.1000-4000 పంచుతున్నట్లు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా ఇళ్లకు వెళ్లి డబ్బులు చేతిలో పెట్టి, ఓటు వేయాలని దండం పెడుతున్నారు. ఇక లిక్కర్ క్వార్టర్లు, చికెన్ బిర్యానీల పంపిణీకి అడ్డే లేదు.

News December 10, 2025

గ్లోబల్ సమ్మిట్‌కు విద్యార్థులు.. PHOTO GALLERY

image

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో విద్యార్థులు సందడి చేశారు. నిన్నటితో సమ్మిట్ ముగియగా ఇవాళ ఫ్యూచర్‌ సిటీలోని వేదిక వద్దకు స్టూడెంట్స్‌కు అధికారులు ఉచిత ప్రవేశం కల్పించారు. వారంతా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆసక్తిగా తిలకించారు. రోబో చేస్తున్న పనులను చూసి పారిశుద్ధ్య కార్మికులు ఆశ్చర్యపోయారు. అందుకు సంబంధించిన ఫొటోలను పైన గ్యాలరీలో చూడవచ్చు.