News August 5, 2024
పతకాలతో ఐఫిల్ టవర్ వద్ద మను

పారిస్కు తలమానికమైన ఐఫిల్ టవర్ ఎదుట మనూ భాకర్ తన కాంస్య పతకాలతో తాజాగా ఫొటో దిగారు. ‘పిక్ ఆఫ్ ది డే’ అంటూ క్రీడాభిమానులు ఆ ఫొటోను షేర్ చేస్తున్నారు. పారిస్ ఒలింపిక్స్లో భారత్కు ఇప్పటి వరకు 3 కాంస్య పతకాలు రాగా వాటిలో రెండు మనూ భాకర్వే. 124 ఏళ్ల రికార్డు బద్దలుగొట్టిన ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. పలు బ్రాండ్లు ఆమెను తమ ప్రచారకర్తగా నియమించుకునేందుకు పోటీ పడుతున్నాయి.
Similar News
News December 24, 2025
భారత్ అండర్-19 జట్టుపై ICCకి ఫిర్యాదు చేస్తాం: పాక్

అండర్-19 ఆసియా కప్-2025 ఫైనల్లో భారత్ టీమ్ తీరుపై ICCకి కంప్లైంట్ చేయనున్నట్టు PCB, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ చెప్పారు. ‘మ్యాచ్ జరుగుతున్నంత సేపు టీమ్ఇండియా ప్లేయర్లు పాక్ ఆటగాళ్లను రెచ్చగొడుతూనే ఉన్నారు. పాలిటిక్స్, స్పోర్ట్స్ను వేరుగా చూడాలి. భారత ఆటగాళ్ల తీరుపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తాను’ అని తెలిపారు. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో అండర్-19 ఆసియా కప్ను పాక్ గెలుచుకుంది.
News December 24, 2025
పాన్-ఆధార్ లింక్ చేశారా? DEC 31 వరకే గడువు

పాన్-ఆధార్ లింక్ చేసుకునేందుకు గడువు DEC 31తో ముగియనుంది. ఆలోగా లింక్ చేయకపోతే పాన్ రద్దవుతుంది. లింక్ చేసేందుకు IT ఈ-ఫైలింగ్ <
News December 24, 2025
భారత్లో కొత్త ఎయిర్ లైన్స్: రామ్మోహన్

భారత గగనతలంలోకి ప్రవేశించేందుకు Shankh Air, Al Hind Air, FlyExpress అనే కొత్త ఎయిర్లైన్స్ సిద్ధమవుతున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ‘Shankh Air ఇప్పటికే NOC పొందగా, Al Hind Air, FlyExpress ఈ వారం NOCలు పొందాయి. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ వంటి పథకాలతో Star Air, India One Air, Fly91 వంటి చిన్న సంస్థలు ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి’ అని ట్వీట్ చేశారు.


