News August 7, 2024
మళ్లీ పారిస్కు మనూ భాకర్.. ఎందుకంటే?

ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ మనూ భాకర్ ఇవాళ స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆమెకు ఘనస్వాగతం లభించింది. కాగా ఈ నెల 11న జరిగే ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె మళ్లీ పారిస్ వెళ్లనున్నారు. భారత ఫ్లాగ్ బేరర్గా మను వ్యవహరించనున్నారు. దీంతో ఈ నెల 9న ఆమె ఇక్కడి నుంచి ఫ్రాన్స్ బయల్దేరి వెళ్లనున్నారు. ఇవాళ క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయాతో ఆమె భేటీ కానున్నారు.
Similar News
News December 6, 2025
రిలేషన్షిప్లో ఈ తప్పులు చేస్తున్నారా?

దాంపత్య జీవితంలో చిన్న తప్పులు కూడా ఇద్దరి మధ్య దూరం పెంచేస్తాయని రిలేషన్షిప్ కౌన్సిలర్స్ హెచ్చరిస్తున్నారు. ‘మీ పార్ట్నర్ మాట్లాడేటప్పుడు పట్టనట్లు ఫోన్ చూసుకోకండి. చిన్న విషయాలకు కూడా కేకలు వేయకండి. ఏ చిన్న పనైనా మీ పార్ట్నర్తో డిస్కస్ చేయకుండా మొదలు పెట్టకండి. ఒకరి ఇష్టాన్ని ఒకరు గౌరవించుకోవాలి. ఏ రోజు డిఫరెన్సెస్ని ఆరోజే మాట్లాడుకుంటే లైఫ్ సాఫీగా సాగిపోతుంది’ అని సూచిస్తున్నారు.
News December 6, 2025
నేడు అమెరికాకు మంత్రి లోకేశ్

AP: పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ ఇవాళ్టి నుంచి 10వ తేదీ వరకు అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించనున్నారు. తొలిరోజు డల్లాస్లోని తెలుగువారిని కలుస్తారు. 8, 9వ తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతారు. 10న టొరెంటోలో పర్యటిస్తారు. ఈ 18 నెలల్లో లోకేశ్ అమెరికా వెళ్లడం రెండోసారి కావడం విశేషం. ఇప్పటివరకు US, దావోస్, సింగపూర్ ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటించారు.
News December 6, 2025
శ్రీశైలం: పాతాళగంగ నీరు పచ్చగా ఎందుకు?

చంద్రగుప్త మహారాజు ఓ రాజ్యాన్ని ఓడించి, అంతఃపురంలో ఉన్న రాణిని తన కూతురని తెలియక ఆశించాడు. ఆ విషయం తెలిసినా వెనక్కి తగ్గలేదు. దీంతో చంద్రవతి శ్రీశైలం వచ్చి శివుడిని ప్రార్థించింది. అక్కడకు వచ్చిన చంద్రగుప్తుడు చంద్రవతిని చెడగొట్టబోతుండగా, శివుడు ప్రత్యక్షమయ్యాడు. కామంతో కనులు మూసుకుపోయిన చంద్రగుప్తుడిని పచ్చలబండపై పాతాళగంగలో పడి ఉండమని శాపమిచ్చాడు. అందుకే పాతాళగంగ నీరు పచ్చగా ఉంటుందని కథనం.


