News July 30, 2024
ఈరోజు గెలిస్తే చరిత్రలోకి మను భాకర్

పారిస్ ఒలింపిక్స్లో మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు మను భాకర్. ఇప్పటికే వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించగా, ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ కాంస్యం కోసం పోటీ పడుతున్నారు. ఇదీ గెలిస్తే 124 ఏళ్లలో భారత్ తరఫున ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచిన ప్లేయర్గా ఆమె నిలుస్తారు. చివరిగా 1900 ఒలింపిక్స్లో నార్మన్ ప్రిచర్డ్ అనే బ్రిటీష్ ఇండియన్ భారత్ తరఫున రెండు పతకాలు గెలిచారు.
Similar News
News December 21, 2025
ఫ్యూచర్ సిటా? తోక సిటా?: కేసీఆర్

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ‘మేం ఫార్మా సిటీ కోసం భూమి తీసుకున్నాం. దాన్ని ఫ్యూచర్ సిటీ అంటున్నారు. విద్యార్థులను సాకలేని మీరు ఫ్యూచర్ సిటీ కడతారా? అది ఫ్యూచర్ సిటా? తోక సిటా? వనతార అంటూ జూపార్కును అమ్మేస్తారా? ఈ ప్రభుత్వంలో దిక్కుమాలిన పాలసీలు.. రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందాలే కనిపిస్తున్నాయి’ అని ఫైరయ్యారు.
News December 21, 2025
RTCలో ఉచిత ప్రయాణానికి స్పెషల్ కార్డులు: భట్టి

TG: మహాలక్ష్మి స్కీమ్తో RTC లాభాల్లోకి వచ్చిందని, ఇప్పటివరకు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగినట్లు Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. మహిళల కోసం స్పెషల్ కార్డులు ఇస్తామన్నారు. నిజామాబాద్, వరంగల్కు 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నట్లు వెల్లడించారు. స్కూల్స్ తెరిచేసరికి బుక్స్, యూనిఫామ్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నాయీబ్రాహ్మణ, రజకుల ఫ్రీ కరెంట్ బకాయిలు ఉండొద్దని సూచించారు.
News December 21, 2025
టైర్లు నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి?

నేచురల్ రబ్బర్ నిజానికి తెల్లగా ఉంటుంది. కానీ వాహనాల టైర్లు నలుపు తప్ప మరో రంగులో కనిపించవు. దానికి ప్రధాన కారణం Carbon Black. దీన్ని రబ్బరుకు కలపడం వల్ల అది నల్లగా మారుతుంది. ఇది టైరుకు మంచి గ్రిప్ ఇస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే UV Rays తగలకుండా కాపాడుతుంది. దీనివల్ల టైర్లు త్వరగా అరిగిపోకుండా ఎక్కువ కాలం మన్నిక ఇస్తాయి.


