News July 30, 2024
ఈరోజు గెలిస్తే చరిత్రలోకి మను భాకర్

పారిస్ ఒలింపిక్స్లో మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు మను భాకర్. ఇప్పటికే వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించగా, ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ కాంస్యం కోసం పోటీ పడుతున్నారు. ఇదీ గెలిస్తే 124 ఏళ్లలో భారత్ తరఫున ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచిన ప్లేయర్గా ఆమె నిలుస్తారు. చివరిగా 1900 ఒలింపిక్స్లో నార్మన్ ప్రిచర్డ్ అనే బ్రిటీష్ ఇండియన్ భారత్ తరఫున రెండు పతకాలు గెలిచారు.
Similar News
News February 3, 2026
సంగారెడ్డి: 14, 15వ ఓపెన్ స్కూల్ పరీక్షలు

సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో చదువుతున్న పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఈ నెల 14, 15న బేస్ లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు DEO ఎస్. వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణపై ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్లు విస్తృత ప్రచారం కల్పించాలని ఆయన ఆదేశించారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ను 80084 03635 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
News February 3, 2026
రూ.600 కోట్లతో క్యాన్సర్ రోగులకు ఉచిత వైద్యం: సత్యకుమార్ యాదవ్

AP: క్యాన్సర్ రోగులకు ఏటా రూ.600 కోట్లతో ఉచిత వైద్యం అందిస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘క్యాన్సర్ నియంత్రణకు మరిన్ని చర్యలు చేపడుతున్నాం. క్యాన్సర్ను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి వైద్యం అందిస్తున్నాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికోసం పాలియేటివ్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. 23 సెకండరీ ఆసుపత్రుల్లో డే కేర్ కీమో థెరఫీ సెంటర్లను నెలకొల్పుతున్నాం’ అని మంత్రి వివరించారు.
News February 3, 2026
క్రేజీ కాంబో.. ధురంధర్ డైరెక్టర్తో అల్లు అర్జున్ మూవీ?

‘ఉరి’, ‘ధురంధర్’ ఫేమ్ ఆదిత్య ధర్ డైరెక్షన్లో అల్లు అర్జున్ నటించబోతున్నట్లు టాక్. ఆదిత్య తన కలల ప్రాజెక్ట్ను బన్నీకి వినిపించగా దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ధురంధర్-2 మార్చిలో రిలీజైన తర్వాత ఈ భారీ పాన్ ఇండియా మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అట్లీ డైరెక్షన్లో ఐకాన్ స్టార్ ఓ మూవీ చేస్తుండగా.. లోకేశ్, త్రివిక్రమ్తోనూ సినిమాలు కమిట్ అయినట్లు సమాచారం.


