News July 30, 2024
ఈరోజు గెలిస్తే చరిత్రలోకి మను భాకర్

పారిస్ ఒలింపిక్స్లో మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు మను భాకర్. ఇప్పటికే వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించగా, ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ కాంస్యం కోసం పోటీ పడుతున్నారు. ఇదీ గెలిస్తే 124 ఏళ్లలో భారత్ తరఫున ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచిన ప్లేయర్గా ఆమె నిలుస్తారు. చివరిగా 1900 ఒలింపిక్స్లో నార్మన్ ప్రిచర్డ్ అనే బ్రిటీష్ ఇండియన్ భారత్ తరఫున రెండు పతకాలు గెలిచారు.
Similar News
News December 12, 2025
WTCలో ఆరో స్థానానికి పడిపోయిన ఇండియా

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో IND స్థానం మరింత దిగజారింది. తాజాగా WIపై NZ విజయం సాధించడంతో WTC పాయింట్ల పట్టికలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ విజయంతో కివీస్ మూడో ప్లేస్కు చేరుకోగా భారత్ ఐదు నుంచి ఆరవ స్థానానికి పడిపోయింది. దీంతో భారత్కు <<18401686>>WTC<<>> ఫైనల్ ఆశలు సన్నగిల్లుతున్నాయి. ప్రస్తుతం AUS అగ్రస్థానంలో ఉండగా, SA రెండో స్థానంలో కొనసాగుతోంది.
News December 12, 2025
మోతాదుకు మించి ఎరువులు వద్దు

వ్యవసాయంలో నేల, నీరు, విత్తనం తర్వాత ఎరువులు కీలకపాత్ర పోషిస్తాయి. అధిక దిగుబడుల కోసం నిపుణుల సూచనలను పక్కనపెట్టి రైతులు ఎక్కువగా ఎరువులను వాడుతున్నారు. దీని వల్ల పెట్టుబడి భారం పెరగడంతో పాటు ఎరువుల వృథా జరుగుతోంది. అధికంగా వేసిన ఎరువులను మొక్కలు పరిమితంగానే వినియోగించుకుంటాయి. మిగిలినవి భూమిలోకి చేరుతాయి. అందుకే వ్యవసాయ అధికారుల సిఫార్సుల మేరకు పంట దశను బట్టి రైతులు ఎరువులను వాడటం మంచిది.
News December 12, 2025
మూడు రోజుల్లో రూ.3,760 పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ ఉదయం నుంచి <<18540435>>రెండు<<>> సార్లు బంగారం ధరలు పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ఉదయం నుంచి రూ.2,450 పెరిగి రూ.1,33,200కు చేరింది. 3 రోజుల్లోనే రూ.3,760 పెరగడం గమనార్హం. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.2,250 ఎగబాకి రూ.1,22,100 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,15,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


