News July 27, 2024
10M ఎయిర్ పిస్టల్ ఫైనల్కు మనుభాకర్

పారిస్ ఒలింపిక్స్ మహిళల 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ క్వాలిఫయర్స్లో మను భాకర్ అదరగొట్టారు. 580 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచారు. పతక పోటీకి అర్హత సాధించారు. కొన్ని సిరీసుల్లో అమేజింగ్ ఫైరింగ్తో ఆకట్టుకున్న ఆమె ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు. ఒకానొక దశలో రెండో ప్లేస్కు చేరుకున్నారు. ఆఖర్లో కాస్త తడబడటంతో ర్యాంకు తగ్గిపోయింది. రిథమ్ సంగ్వాన్ తొలుత అదరగొట్టినా అర్హత సాధించలేకపోయారు. #Olympics2024
Similar News
News November 13, 2025
మార్నింగ్ అప్డేట్స్

* ఢిల్లీ పేలుడు: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి.. 13కు చేరిన మరణాల సంఖ్య
* APలోని గుంటూరులో పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదం.. విధులకు ఆటంకం కలిగించారని పట్టాభిపురం PSలో కేసు నమోదు
* TGలోని ములుగులో చలికి వృద్ధురాలు రాధమ్మ(65) మృతి
* తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు
* అఫ్గానిస్థాన్లో 4.2 తీవ్రతతో భూకంపం
News November 13, 2025
రాష్ట్రంలో రూ.82వేల కోట్లు పెట్టుబడి: లోకేశ్

AP: బిగ్ అప్డేట్ ఏంటో మంత్రి లోకేశ్ రివీల్ చేశారు. రెన్యూ(ReNew) ఎనర్జీ రాష్ట్రంలో రూ.82 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. 5 ఏళ్ల తర్వాత సోలార్ ఇన్గోట్, వేఫర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు విశాఖలో జరిగే CII భాగస్వామ్య సదస్సుకు ఆ సంస్థ బృందానికి మంత్రి ఆహ్వానం పలికారు.
News November 13, 2025
టెర్రర్ మాడ్యూల్.. మొహియుద్దీన్ నివాసంలో తనిఖీలు

ఉగ్ర లింకుల నేపథ్యంలో హైదరాబాద్లో గుజరాత్ ATS సోదాలు నిర్వహించింది. రాజేంద్రనగర్లోని డా.మొహియుద్దీన్ నివాసంలో తనిఖీలు చేసి 3 రకాల లిక్విడ్లను స్వాధీనం చేసుకుంది. ఆయిల్ మెషీన్తో పాటు కొన్ని పుస్తకాలు సీజ్ చేసింది. జైషే మహ్మద్ సానుభూతిపరుడు మొహియుద్దీన్ ఆముదం గింజల వ్యర్థాల నుంచి రెసిన్ అనే విషాన్ని తయారుచేశాడు. దానితో వేలాది మందిని చంపాలని ప్లాన్ చేశాడు. ఈక్రమంలోనే ఇటీవల అతడిని అరెస్ట్ చేశారు.


