News April 14, 2025

సమ్మర్‌లో కీరదోసతో ఎన్నో లాభాలు!

image

* కీరదోసలోని 96% నీటి వల్ల డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తదు.
* అంతర్గత వాపు, కండరాల నొప్పిని తగ్గిస్తుంది.
* పొటాషియం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
* చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచుతుంది.
* నోటి దుర్వాసన తగ్గడంతో పాటు శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తుంది.
* బరువు తగ్గాలనుకునే వారికి కీరదోస మంచి ఆయుధం.
* కీరలోని డైయూరిటిక్‌ గుణాలు మూత్రం ద్వారా టాక్సిన్స్‌ బయటకు పంపుతాయి.

Similar News

News November 21, 2025

గుమ్మానికి నిమ్మ, మిరపకాయ ఎందుకు కడతారు?

image

ఇళ్లు, షాప్‌ గుమ్మాలకు, వాహనాలకు నిమ్మ, మిరపకాయలు కడుతుంటారు. ఇది చెడు దృష్టిని తొలగిస్తుందని నమ్మకం. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పదార్థాల వాడకం పెంచేందుకే పూర్వీకులు ఈ పద్ధతిని ప్రోత్సహించారని అంటారు. ఇలా కడితే ఇంటి చుట్టూ ఉండే వాతావరణం శుభ్రమవుతుంది. వాహనాలకు వీటిని తగిలించడం వలన వీటిలోని సానుకూల శక్తి చుట్టూ ఉండే చెడు దృష్టిని తొలగించి, ప్రమాదాలు జరగకుండా కాపాడుతుందని విశ్వాసం.

News November 21, 2025

ఓట్ల సవరణ ఆపండి.. ECకి మమతా బెనర్జీ లేఖ

image

రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)ను నిలిపివేయాలని CEC జ్ఞానేశ్ కుమార్‌కు బెంగాల్ CM మమతా బెనర్జీ లేఖ రాశారు. ‘BLOలు పరిమితి దాటి పని చేస్తున్నారు. EC తీరు ఆమోదయోగ్యంగా లేదు. వారికి సపోర్టుగా నిలిచేది పోయి బెదిరింపులకు పాల్పడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న SIRను ఆపాలని కోరుతున్నా. వారికి సరైన ట్రైనింగ్ ఇవ్వండి. ప్లానింగ్ లేకుండా చేస్తున్న ఈ ప్రక్రియ ప్రమాదకరం’ అని పేర్కొన్నారు.

News November 21, 2025

మహిషి కన్నీరు కలిసిన జలం

image

శబరిమల యాత్రలో ముఖ్య ప్రాంతాల్లో ‘అళుదా నది’ ఒకటి. మహిషిని అయ్యప్ప స్వామి వధించిన స్థలం ఇదేనని ప్రతీతి. స్వామి బాణాలకు తాళలేక మహిషి రోదిస్తూ కన్నుమూశాడు. అప్పుడు కార్చిన కన్నీరు ఈ నదిలో కలిసిందట. అందుకే దీన్ని అళుదా(రోదించడం) నది అని అంటారు. అయ్యప్ప భక్తులు ఈ నదిలో పవిత్ర స్నానం ఆచరించి, 2 రాళ్లను తీసుకొని, యాత్ర మార్గంలోని కల్లిడుకుండ్రుం వద్ద విసిరి తమ యాత్రను కొనసాగిస్తారు. <<-se>>#AyyappaMala<<>>