News April 14, 2025

సమ్మర్‌లో కీరదోసతో ఎన్నో లాభాలు!

image

* కీరదోసలోని 96% నీటి వల్ల డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తదు.
* అంతర్గత వాపు, కండరాల నొప్పిని తగ్గిస్తుంది.
* పొటాషియం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
* చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచుతుంది.
* నోటి దుర్వాసన తగ్గడంతో పాటు శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తుంది.
* బరువు తగ్గాలనుకునే వారికి కీరదోస మంచి ఆయుధం.
* కీరలోని డైయూరిటిక్‌ గుణాలు మూత్రం ద్వారా టాక్సిన్స్‌ బయటకు పంపుతాయి.

Similar News

News December 9, 2025

ADB: ప్రచారం ముగిసింది.. పోలింగ్ మిగిలింది

image

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి సెక్షన్ 163 BNSS అమలులోకి వస్తుందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమని పేర్కొన్నారు.​ ఇప్పటి నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఆ ప్రాంతాలలో అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలన్నారు. పోలింగ్ డిసెంబర్ 11 ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని, అదే రోజు ఫలితాలు వస్తాయన్నారు.

News December 9, 2025

ఈ టైమ్‌లో రీల్స్ చూస్తున్నారా? వైద్యుల సలహా ఇదే!

image

ఈమధ్య చాలామంది రీల్స్ చూస్తూ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. అనవసర రీల్స్ చూసే సమయాన్ని వ్యాయామానికి, నిద్ర కోసం కేటాయించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం లేవగానే ఫోన్‌లో రీల్ స్క్రోల్ చేయకుండా వ్యాయామం చేయడం ఉత్తమం అని తెలిపారు. రాత్రుళ్లు మొబైల్ నుంచి వచ్చే బ్లూలైట్ నిద్రను నియంత్రించే మెలటోనిన్‌ను అణచివేసి, నిద్ర నాణ్యతను తగ్గిస్తుందని వారు హెచ్చరించారు. share it

News December 9, 2025

ఇతిహాసాలు క్విజ్ – 91 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: శ్రీరాముడి కవల కుమారులే లవకుశులు. మరి రాముడు తన పుత్రులతో యుద్ధమెందుకు చేశాడు?
సమాధానం: శ్రీరాముడు నిర్వహించిన అశ్వమేధ యాగ గుర్రాన్ని వాల్మీకి ఆశ్రమంలో ఉన్న లవకుశులు బంధించారు. అది వారి తండ్రి అశ్వమని వాళ్లకు తెలియదు. అయితే, రాజధర్మాన్ని పాటించాల్సి వచ్చిన రాముడు, గుర్రాన్ని విడిపించడానికి తన సైన్యాన్ని పంపగా, ఆ ఘట్టం చివరకు తండ్రీకొడుకుల మధ్య యుద్ధానికి దారితీసింది.
<<-se>>#Ithihasaluquiz<<>>