News September 21, 2024
జగన్ పాలనలో అనేక దుస్సాహసాలు జరిగాయి: CM చంద్రబాబు
AP: గత ప్రభుత్వం వల్ల తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని CM చంద్రబాబు అన్నారు. ‘లడ్డూ అపవిత్రం కావడంపై లోతుగా విచారణ జరగాలి. రూ.320కే కిలో నెయ్యి ఎలా దొరుకుతుంది? జగన్ పాలనలో అనేక దుస్సాహసాలు జరిగాయి. రివర్స్ టెండరింగ్ పేరుతో సర్వనాశనం చేశారు. అన్ని దేవాలయాల్లో తనిఖీలు చేస్తున్నాం. తిరుమల పవిత్రతను కాపాడే అంశంపై పండితులతో చర్చిస్తున్నాం’ అని మీడియాతో చిట్ చాట్లో వ్యాఖ్యానించారు.
Similar News
News September 21, 2024
జానీ మాస్టర్ భార్య అరెస్ట్కు రంగం సిద్ధం?
TG: అత్యాచార ఆరోపణలతో అరెస్టై చంచల్గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో ఆయన భార్య ఆయేషాను పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు యత్నించారన్న ఆరోపణలతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ యువతిని ఆయేషా బెదిరించినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
News September 21, 2024
దేశాన్ని విడదీయడానికి రాహుల్ వెనుకాడరు: కంగన
రాహుల్ గాంధీ అధికారం కోసం దేశాన్ని విడదీయడానికి వెనుకాడబోరని BJP MP కంగనా రనౌత్ విమర్శించారు. రాహుల్ విదేశాల్లో భారత్ గురించి ఎలాంటి విషయాలు మాట్లాడుతారన్నది అందరికీ తెలిసిన విషయమే అన్నారు. ‘కొంత మంది ప్రజల్ని వాడుకుంటున్నారు. కొన్ని వర్గాల్ని రెచ్చగొడుతున్నారు. దేశంపై రాహుల్కు ఉన్న భావనలు తెలిసిందే. అధికారం కోసం ఆయన దేశాన్ని విడదీయడానికి వెనుకాడరు’ అని కంగన విమర్శించారు.
News September 21, 2024
దేవుడికీ కల్తీ బాధ తప్పలేదు!
కల్తీ.. కల్తీ.. కల్తీ.. ఎక్కడ చూసినా, ఏది తిన్నా కల్తీనే. ముఖ్యంగా వంటనూనెల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. జంతువుల ఎముకలను బాగా వేడి చేసి అందులో నుంచి నూనె తీసి అమ్ముతున్నారు. రేటు తక్కువ అని కొంటే ఆస్పత్రి పాలవ్వడం ఖాయం. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి కూడా ఈ కల్తీ బాధ తప్పలేదు. డబ్బు ఆశ, పెరుగుతున్న జనాభాకు సరిపడా వనరులు లేకపోవడమూ కల్తీకి ఓ కారణమని నిపుణుల అభిప్రాయం. దీనిపై మీ కామెంట్.