News July 5, 2024
మీ ప్రేమకు చాలా థ్యాంక్స్: సూర్య కుమార్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720163553341-normal-WIFI.webp)
ముంబై మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు సాగిన ‘విక్టరీ పరేడ్’ గురించి స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. ‘నిన్నటి సాయంత్రాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. మా చుట్టూ ఉన్నవారిలో సంతోషం, భావోద్వేగాలు, వేడుకలు చూస్తే అంతా కలగా అనిపించింది. మీరు చూపిన ప్రేమకు చాలా థ్యాంక్స్. ఇది చూస్తే అర్థమవుతోంది మీకు ఈ కప్ అంటే ఎంత ఇష్టమో. ఈ కప్ మీ అందరికీ చెందినది’ అని ట్వీట్ చేశారు.
Similar News
News July 8, 2024
సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భేటీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720415192041-normal-WIFI.webp)
TG: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం ఇంటికి వెళ్లి కలిశారు. దీంతో ఆయన పార్టీ మారనున్నారనే <<13585753>>ప్రచారానికి<<>> బలం చేకూరినట్లైంది. రేవంత్ మహబూబ్నగర్ పర్యటనలో భాగంగా చల్లా కాంగ్రెస్లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
News July 8, 2024
హైదరాబాద్లో చంద్రబాబు, వైఎస్సార్ ఫ్లెక్సీలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720414311324-normal-WIFI.webp)
చాలా రోజుల తర్వాత హైదరాబాద్ నగరంలో చంద్రబాబు, వైఎస్సార్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ వచ్చిన సందర్భంగా చంద్రబాబువి, జయంతి సందర్భంగా వైఎస్సార్ ఫ్లెక్సీలను టీడీపీ, కాంగ్రెస్ అభిమానులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఏపీలో ఈ ఇద్దరు నాయకులు సీఎంలుగా హైదరాబాద్ నుంచే పాలన సాగించారు. కాగా, తెలంగాణలోనూ టీడీపీ జెండా ఎగరేస్తామని చంద్రబాబు నిన్న కార్యకర్తల సమావేశంలో చెప్పారు.
News July 8, 2024
T20WC: ఒక్కో క్రికెటర్కు ₹5కోట్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720409482439-normal-WIFI.webp)
టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు BCCI ₹125కోట్లు నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని పంచగా 15మంది ఆటగాళ్లు, కోచ్ ద్రవిడ్కి ఒక్కొక్కరికి ₹5కోట్లు రానున్నాయి. మిగిలిన కోచ్లు ₹2.5కోట్ల చొప్పున అందుకుంటారు. బ్యాక్రూమ్ స్టాఫ్ తలా ₹2కోట్లు, సెలెక్షన్ కమిటీలోని సభ్యులు, రిజర్వ్ ప్లేయర్లు ₹కోటి చొప్పున అందుకుంటారు. వాంఖడేలో ఇప్పటికే దీనికి సంబంధించిన చెక్కును BCCI జట్టుకు అందించింది.