News June 23, 2024

విజయవాడ పరిధిలో రేపటి నుంచి పలు రైళ్లు రద్దు

image

AP: విజయవాడ డివిజన్ పరిధిలో నడిచే పలు రైళ్లను రేపటి నుంచి ఈ ఏడాది ఆగస్టు 11 వరకు రద్దు చేయనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రైల్వే లైన్లలో ఆధునికీకరణ పనులు చేపట్టిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రధానంగా విశాఖ-గుంటూరు, విశాఖ-తిరుపతి, విశాఖ-విజయవాడ, రాజమండ్రి-విశాఖ మధ్య నడిచే రైళ్లు వీటిలో ఉన్నాయి.

Similar News

News December 3, 2025

GNT: ఆ వ్యాధికి.. డీఎంహెచ్ఓ సూచనలు

image

స్క్రబ్ టైఫస్ట్ అనేది జూనోటిక్ వ్యాధి అని, ఓరియన్షియా సుసుగముషి అనే పేడ పురుగు బ్యాక్టీరియాతో వ్యాధి సంక్రమిస్తుందని DMHO విజయలక్ష్మీ తెలిపారు. శరీరం పై నల్లమచ్చల దద్దర్లు,జ్వరం,తలనొప్పి,వణుకు, కండరాల నొప్పులు వ్యాధి లక్షణాలన్నారు. వ్యాధి నిర్థారణ పరీక్ష గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే అందుబాటులో ఉందన్నారు. శరీరాన్ని పూర్తిగా దుస్తులతో కప్పి ఉంచడం, పొలం పనులు చేసే వారు రబ్బరు బూట్లు ధరించాలన్నారు.

News December 3, 2025

ఆ విమానం ఎక్కడ..? మళ్లీ వెతుకులాట!

image

దశాబ్దం కింద కనిపించకుండా పోయిన విమానం కోసం మళ్లీ వెతుకులాట మొదలవనుంది. 2014 MAR 8న 239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయల్దేరిన MH-370 విమానం అదృశ్యమైంది. ఇది ఏవియేషన్ చరిత్రలోనే అతిపెద్ద మిస్టరీగా మారింది. ఈ విమానం హిందూ మహాసముద్రంలో కూలిందన్న అనుమానంతో 50 విమానాలు, 60 ఓడలతో గాలించినా దొరకలేదు. MARలో సెర్చ్ ఆపరేషన్ ముగించగా, ఈ నెల 30న మళ్లీ గాలింపు మొదలుపెడతామని మలేషియా తాజాగా ప్రకటించింది.

News December 3, 2025

రైతుల ఖాతాల్లో రూ.7,887కోట్లు జమ: ఉత్తమ్

image

వరి సేకరణలో TG అగ్రస్థానంలో కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ‘ఇప్పటివరకు 41.6 లక్షల టన్నుల ధాన్యం సేకరించాం. 48hrsలో ₹7,887Cr చెల్లించాం. 8,401 PPCలలో 7.5 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. సన్న రకాలకు ₹314Cr బోనస్ చెల్లించాం. అటు APలో ఇప్పటివరకు 11.2L టన్నులు సేకరించారు. 1.7లక్షల మందికి రూ.2,830Cr చెల్లించారు. AP కంటే TG స్కేల్ 4 రెట్లు ఎక్కువ’ అని ట్వీట్ చేశారు.