News February 4, 2025
అన్ని ఆఫీసుల్లో మరాఠీ తప్పనిసరి.. లేదంటే చర్యలు
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని GOVT కార్యాలయాల్లో ఉద్యోగులంతా తప్పనిసరిగా మరాఠీలోనే మాట్లాడాలని ఆదేశాలు జారీ చేసింది. లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరాఠీ భాష పరిరక్షణ, అభివృద్ధి కోసం ప్రజా వ్యవహారాల్లో ఈ భాషను ఉపయోగించాలని ప్రభుత్వ కమిటీ సిఫారసు చేసింది. కంప్యూటర్ కీ బోర్డుల్లోనూ మరాఠీ దేవనాగరి లిపి ఉండాలని పేర్కొంది. ఆ మేరకు GOVT చర్యలు ప్రారంభించింది.
Similar News
News February 4, 2025
అంతుచిక్కని వ్యాధి.. 15 రోజుల్లో 40 లక్షల కోళ్లు మృతి
AP: అంతుచిక్కని వ్యాధి దెబ్బకు పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో 450 వరకు పౌల్ట్రీలు ఉండగా, 15 రోజుల్లోనే 40 లక్షలకు పైగా కోళ్లు మృత్యువాత పడినట్లు అంచనా. ఒక్కో కోడి మరణంతో సగటున రూ.300 వరకు నష్టం వస్తోందని రైతులు వాపోతున్నారు. కోళ్ల మరణాలకు కారణాలపై అధికారులు సైతం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. శాంపిల్స్ను ల్యాబ్కు పంపామని, నివేదిక రావాల్సి ఉందని చెబుతున్నారు.
News February 4, 2025
నేడు పీఎం మోదీ ఏం మాట్లాడుతారు?
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సా.5 గంటలకు లోక్సభలో ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడంతో పాటు బడ్జెట్పై మాట్లాడనున్నారు. రాహుల్ గాంధీ సహా విపక్ష నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. రేపు ఢిల్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా మారింది. ఉద్యోగులకు రూ.12లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ అంశాన్ని కూడా పీఎం ప్రస్తావించే ఛాన్సుంది.
News February 4, 2025
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్
హైదరాబాద్-ముంబై మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. 709K.M దూరమున్న ఈ ప్రాజెక్టు ఫైనల్ లొకేషన్ సర్వే కోసం రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. ఈ నెల 24లోగా బిడ్లు దాఖలు చేయాలని సూచించింది. బుల్లెట్ రైలులో 2 గంటల్లోనే HYD నుంచి ముంబై చేరుకోవచ్చు. ఆ తర్వాత హైదరాబాద్-బెంగళూర్, చెన్నై మధ్య కారిడార్లు నిర్మించాలనే ఆలోచనతో ఉంది. ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ మార్గం సిద్ధమవుతోంది.