News March 23, 2025
మార్చి 23: చరిత్రలో ఈరోజు

1893: భారతదేశ ఆవిష్కర్త, ఇంజనీర్ జి.డి.నాయుడు జననం
1934: సినీ గాయకుడు కె.బి.కె.మోహన్ రాజు జననం
1968: సినీ నటుడు శ్రీకాంత్ జననం
1979: సినీ గాయకుడు విజయ్ ఏసుదాస్ జననం
1987: నటి, పొలిటీషియన్ కంగనా రనౌత్ జననం
1931: జాతీయోద్యమ నాయకులు భగత్ సింగ్, సుఖ్ దేవ్ మరణం (ఫొటోలో)
* ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం
Similar News
News March 24, 2025
నితీశ్ కుమార్ మెంటల్లీ అన్ఫిట్: ప్రశాంత్ కిశోర్

బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేయాలని జన్ సూరజ్ చీఫ్ ప్రశాంత్ కిశోర్ డిమాండ్ చేశారు. క్షీణిస్తున్న మానసిక, శారీరక ఆరోగ్యం కారణంగా ఆయన ఇకపై పాలించడానికి తగినవారు కాదని అన్నారు. ‘నితీశ్ కుమార్ మెంటల్లీ అన్ఫిట్. ఎవరికైనా డౌట్ ఉంటే మంత్రుల పేర్లు చెప్పమని అడగండి. ఆయన పరిస్థితి గురించి ప్రధాని మోదీ, అమిత్ షాకు తెలియదంటే నమ్మలేకపోతున్నా’ అని వ్యాఖ్యానించారు.
News March 24, 2025
IPL: ముంబైకి ఇదేం కొత్త కాదు

IPLలో ముంబై ఇండియన్స్ ఓ ఆనవాయితీని కొనసాగిస్తూ వస్తోంది. 2013 నుంచి ప్రతీ సీజన్లో తొలి మ్యాచ్ ఓడిపోవడం అలవాటుగా మార్చుకుంది. తాజాగా CSKతో మ్యాచులోనూ ఓడిపోయింది. ఇలా వరుసగా 13 ఓపెనింగ్ మ్యాచులు ఓడిన జట్టుగా నిలిచింది. అయితే 2013 నుంచి 5 సార్లు ఆ జట్టు ఛాంపియన్గా నిలవడం గమనార్హం.
News March 24, 2025
బెట్టింగ్కు పాల్పడితే కఠిన చర్యలు: DGP

AP: బెట్టింగ్లకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు DGP హరీశ్ కుమార్ గుప్తా సూచించారు. IPL బెట్టింగ్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. బెట్టింగ్ నిర్వహించినా, పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాఫిట్స్ వస్తాయని నమ్మి బెట్టింగ్ మాఫియా వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని, బెట్టింగ్ ముఠాల చేతిలో మోసపోయిన వారు ఫిర్యాదు చేస్తే నిందితులపై కేసు నమోదు చేస్తామన్నారు.