News May 2, 2024

ఈ దశలో గుర్తు మార్చలేం: ఈసీ

image

AP: స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై టీడీపీ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. దీని వల్ల తమ కూటమికి నష్టం కలుగుతుందని టీడీపీ తరఫు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని, ఈ దశలో గుర్తు మార్చలేమని ఈసీ తరఫు లాయర్ వాదించారు. దీంతో తదుపరి విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.

Similar News

News October 23, 2025

ఉపాధి హామీ పథకానికి నిధులు విడుదల

image

AP: ఉపాధి హామీ పథకానికి మెటీరియల్ కాంపోనెంట్ కింద 2025–26 ఏడాదికి మొదటి విడతగా కేంద్రం రూ.665 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.166 కోట్లు జత చేసింది. రాష్ట్రంలో పంచాయతీ భవనాల నిర్మాణం, రికార్డులు కంప్యూటరీకరణ, ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ నిమిత్తం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్(RGSA) ద్వారా రూ.50 కోట్లు నిధులు విడుదల చేసింది. వీటికి రాష్ట్రం రూ.33 కోట్లు జత చేయనుంది.

News October 23, 2025

రాకియా పిటిషన్ విచారణ ఎల్లుండికి వాయిదా

image

TG: వాన్‌పిక్ వ్యవహారంలో వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌పై రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్‌‍మెంట్ అథారిటీ(RAKIA) దాఖలు చేసిన పిటిషన్‌ను సిటీ సివిల్ కోర్టు(HYD) విచారించింది. తమకు రూ.600 కోట్లు చెల్లించాలన్న రస్ అల్ ఖైమా కోర్టు ఆదేశాలు అమలు చేయాలని రాకియా పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను త్వరగా తేల్చాలని ఇటీవల TG హైకోర్టు ఆదేశించింది. రాకియా ఎగ్జిక్యూటివ్ పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది.

News October 22, 2025

సౌత్ ఆఫ్రికా సిరీస్‌లో హార్దిక్ పాండ్య!

image

ఆసియా కప్ సమయంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయంతో హార్దిక్ పాండ్య టీమ్‌కు దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌కు కూడా అతను విశ్రాంతిలోనే ఉన్నారు. అయితే హార్దిక్ కోలుకున్నారని, సౌత్ ఆఫ్రికాతో జరగబోయే సిరీస్‌కి అందుబాటులో ఉంటారని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. SA జట్టు నవంబర్ 14 నుంచి డిసెంబర్ 19 వరకు 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20ల కోసం భారత్‌లో పర్యటించనుంది.