News May 2, 2024
ఈ దశలో గుర్తు మార్చలేం: ఈసీ

AP: స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై టీడీపీ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. దీని వల్ల తమ కూటమికి నష్టం కలుగుతుందని టీడీపీ తరఫు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని, ఈ దశలో గుర్తు మార్చలేమని ఈసీ తరఫు లాయర్ వాదించారు. దీంతో తదుపరి విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.
Similar News
News December 19, 2025
రాత్రుళ్లు వచ్చే హార్ట్ అటాక్స్ తక్కువ ప్రమాదకరమా?

రాత్రుళ్లు వచ్చే హార్ట్ అటాక్లు తక్కువ ప్రమాదకరమని తాజా స్టడీలో వెల్లడైంది. డేటైమ్లో న్యూట్రోఫిల్స్ యాక్టివ్గా ఉండడంతో ఇన్ఫ్లమేషన్ పెరిగి గుండెకు నష్టం ఎక్కువ జరుగుతున్నట్టు గుండెపోటుకు గురైన 2వేల మంది రికార్డులు పరిశీలించి గుర్తించారు. CXCR4 రిసెప్టర్లు పెంచి న్యూట్రోఫిల్స్ కదలికలను నియంత్రించే పరిశోధనలను ఎలుకలపై చేపట్టారు. న్యూట్రోఫిల్స్ తీవ్రతను తగ్గించే మందుల తయారీపై దృష్టిపెడుతున్నారు.
News December 19, 2025
సౌతాఫ్రికా దూకుడు.. 10 ఓవర్లలోనే 118

భారత్ నిర్దేశించిన 232 పరుగుల భారీ లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా దుమ్మురేపుతోంది. 10 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 118 రన్స్ చేసింది. ఓపెనర్ డికాక్ (65*), బ్రెవిస్ (29*) చెలరేగి ఆడుతున్నారు. హెండ్రిక్స్ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేశారు. భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. మరి ఈ మ్యాచులో భారత్ గెలుస్తుందా? కామెంట్ చేయండి.
News December 19, 2025
అమిత్ షాతో చంద్రబాబు భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల పురోగతి, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇటీవల నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు వచ్చిన సానుకూల స్పందనను వివరించారు. అంతకుముందు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన సీఎం.. అమరావతి ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని, హైవే నెట్వర్క్లతో రాజధానిని కనెక్ట్ చేయాలని కోరారు.


