News April 17, 2025

భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

image

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,508 పాయింట్లు వృద్ధి చెంది 78,553 వద్ద సెటిల్ అయింది. నిఫ్టీ 414 పాయింట్లు లాభపడి 23,851 వద్ద స్థిరపడింది. బ్యాంక్, ఆయిల్, గ్యాస్ సెక్టార్ల షేర్లు దూసుకెళ్లాయి. ఎటర్నల్, ICICI బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, SBI, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్ షేర్లు టాప్‌లో నిలిచాయి.

Similar News

News April 19, 2025

JEE మెయిన్‌లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు ఎవరంటే?

image

జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల్లో 24 మంది విద్యార్థులకు 100 పర్సంటైల్ రాగా, వారిలో నలుగురు తెలుగువారు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన హర్ష గుప్తాకు 8, అజయ్ రెడ్డికి 16(ఆలిండియా ఈడబ్ల్యూఎస్ కోటా మొదటి ర్యాంక్), బనిబ్రత మజీకి 24వ ర్యాంక్ వచ్చింది. అలాగే ఏపీకి చెందిన సాయి మనోజ్ఞ ఆలిండియా 22వ ర్యాంకుతో పాటు బాలికల్లో 2వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు.

News April 19, 2025

సమ్మర్‌లో ఎలాంటి దుస్తులు వేసుకోవాలంటే?

image

వేసవికాలంలో ఎండల దెబ్బకు శరీరం చెమటతో తడిసిముద్దవుతుంది. దీని నుంచి రిలీఫ్ కావాలంటే కొన్ని రకాల దుస్తులు ధరించాలని నిపుణులు చెబుతున్నారు. బయటకు వెళ్లినప్పుడు కాటన్‌తో కూడిన లూజ్ బట్టలు ధరించాలి. వీటి వల్ల చెమట ఈజీగా బయటకు వస్తుంది. ఇంట్లో ఉంటే షార్ట్స్, స్లీవ్ లెస్ టీషర్ట్స్ ధరించవచ్చు. లేత రంగుల దుస్తులు ధరించాలి. బ్లాక్, బ్లూ, రెడ్ వంటి రంగుల దుస్తులు వేసుకుంటే వేడిని గ్రహించి అలసిపోతారు.

News April 19, 2025

రేపే బీసీ గురుకుల ఎంట్రన్స్ పరీక్ష

image

TG: బీసీ గురుకుల స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఖాళీగా ఉన్న 6, 7, 8, 9వ తరగతి సీట్లను భర్తీ చేసేందుకు రేపు అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 109 పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. మొత్తం 6,832 బ్యాక్‌లాగ్ సీట్లకు 26,884 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు.

error: Content is protected !!