News December 2, 2024
రాజకీయ దురంధరుడు.. మర్రి చెన్నారెడ్డి..!

ఉమ్మడి AP మాజీ CM మర్రి చెన్నారెడ్డి వర్ధంతి నేడు. 1919 జనవరి 13న వికారాబాద్ జిల్లాలోని సిరిపురంలో ఆయన జన్మించారు. 1953లో వికారాబాద్ MLAగా గెలిచి 27 ఏళ్ల వయసులోనే మంత్రి అయ్యారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ అవతరణను ఆయన గట్టిగా వ్యతిరేకించారు. 1978లో మేడ్చల్ నుంచి పోటీ చేసి CMగా బాధ్యతలు చేపట్టారు. మరోసారి 1989లోనూ CM పీఠం అధిరోహించారు. 1996 డిసెంబర్ 2న తమిళనాడు గవర్నర్గా ఉండగానే కన్నుమూశారు.
Similar News
News November 20, 2025
త్వరలో రెస్టారెంట్లు, సొసైటీల్లో ఎంట్రీకి ఆధార్!

ఆధార్ విషయంలో త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లలో లైవ్ ఈవెంట్కు వెళ్లాలన్నా, హౌసింగ్ సొసైటీల్లోకి ఎంట్రీ కావాలన్నా, ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా మీ గుర్తింపు కోసం ఆధార్ చూపించాల్సి రావొచ్చు. ఆఫ్లైన్ ఆధార్ వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో UIDAI ఈ తరహా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యక్తుల ప్రైవసీకి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆ సంస్థ చెబుతోంది.
News November 20, 2025
TMC-HBCHలో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని <
News November 20, 2025
శబరిమల బంగారం చోరీ కేసులో మరో అరెస్ట్

శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(TDB) మాజీ ప్రెసిడెంట్, CPM మాజీ ఎమ్మెల్యే పద్మా కుమార్ను సిట్ అరెస్ట్ చేసింది. ఆలయం నుంచి కొన్ని విగ్రహాల బంగారు తాపడం చోరీకి గురవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో పద్మ కుమార్ను అధికారులు ఇవాళ ఉదయం నుంచి కొన్ని గంటల పాటు ప్రశ్నించారు. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో TDB మాజీ కమిషనర్తో పాటు పలువురు అరెస్ట్ అయ్యారు.


