News September 20, 2024
ఓటీటీలోకి ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’
రావు రమేశ్, ఇంద్రజ, అంకిత్, రమ్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. సుకుమార్ సతీమణి తబిత నిర్మించిన ఈ సినిమాకు లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించగా, కళ్యాణ్ నాయక్ సంగీతం అందించారు. ఆగస్టు 23న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
Similar News
News September 20, 2024
BJPలో TDP విలీనమౌతుందా?: VSR
AP: ‘BJPలో TDP విలీనమౌతుందా? జమిలి ఎన్నికలయ్యాక TDP జెండా పీకేయ్యడమేనా?’ అంటూ YCP MP విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ‘APలో TDP పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతోందా? లోకేశ్ వ్యవహార శైలితో సీనియర్లు విసిగిపోతున్నారా? అధికారంలోకి వచ్చిన 100 రోజులకే పార్టీలో అసంతృప్తులా? మొన్న మస్తాన్ రావు, మోపిదేవి, నిన్న బాలినేని, సామినేని. లిస్ట్ ఇంకా ఉందా? ఇంకెంతమందిని అవినీతి సొమ్ముతో కొంటారు?’ అని ప్రశ్నించారు.
News September 20, 2024
ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు ఈజీగా ఎలా తీసుకున్నారు?: షర్మిల
AP: తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవడం చిన్న విషయం కాదని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు ఈజీగా ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. 100 రోజుల ముందే తెలిస్తే ఎందుకు బయటపెట్టలేదని, విచారణకు ఎందుకు ఆదేశించలేదని నిలదీశారు. జగన్ హయాంలో ఎంపిక చేసిన కాంట్రాక్టరే నెయ్యి సప్లై చేశారని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు.
News September 20, 2024
యూట్యూబ్: వీడియో పాస్ చేసినా యాడ్స్ వస్తాయి!
YouTubeలో ‘Pause Ads’ అనే ఫీచర్ రానుంది. దీని వల్ల యూజర్లు వీడియో పాస్ చేసినా స్క్రీన్పై సైడ్కు యాడ్స్ ప్లే అవుతాయి. ఇప్పటికే వీడియోలు చూసేటప్పుడు వస్తున్న యాడ్స్తో యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. తాజా ఫీచర్తో మరింత ఇబ్బంది పడే ఛాన్సుంది. యాడ్స్ వద్దనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవడమే బెటర్ అని నెటిజన్లు అంటున్నారు. INDలో YouTube ప్రీమియం సబ్స్క్రిప్షన్ ధర నెలకు ₹149 నుంచి స్టార్ట్ అవుతుంది.