News April 6, 2024
మరికాసేపట్లో ‘మాస్ DJ’ అప్డేట్

‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న నిర్మాత నాగవంశీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇవాళ ఉదయం 11.07 గంటలకు మాస్ డీజే అప్డేట్ ఉంటుందని.. వెయిట్ చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే ‘టిల్లు స్క్వేర్’కు సీక్వెల్గా ‘టిల్లు క్యూబ్’ రానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రేజీ అప్డేట్ ఏమై ఉంటుందా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Similar News
News February 12, 2026
ఇది కదా అసలు సిసలైన మతసామరస్యం!

కర్ణాటక బస్తెవాడకు చెందిన మెహబూబ్, నూర్జహాన్ దంపతులు మానవత్వానికి గొప్ప ఉదాహరణగా నిలిచారు. ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవరైన మెహబూబ్కు ఐదుగురు పిల్లలు. తన స్నేహితుడు, ఆర్టీసీ డ్రైవరైన కాడయ్య, అతడి భార్య మరణించడంతో వారి పిల్లలు సోమశేఖర్, వసంత్ను దత్తత తీసుకున్నారు. 20 ఏళ్ల పాటు వారినీ తమ సొంత బిడ్డల్లా పెంచి డిగ్రీ చదివించారు. ఫిబ్రవరి 8న సోమశేఖర్కు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేశారు.
News February 12, 2026
శివ నామాలు అర్థాలు ‘‘పశుపతి’’

వేదాల ప్రకారం ‘పశు’ అంటే కేవలం జంతువులు అని మాత్రమే కాదు, అజ్ఞానంతో, మాయతో బంధీ అయి ఉన్న ప్రతి జీవి అని అర్థం. జీవులన్నింటినీ రక్షించే వాడు, వారిని అజ్ఞాన బంధనాల నుంచి విముక్తం చేసే యజమాని శివుడు. మనలోని పశుప్రవృత్తిని(అరిషడ్వర్గాలను) అణచివేసి, మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే రక్షకుడు ఆయనే. సమస్త జీవరాశికి ఆయనే ఆధారభూతుడు. పాలకుడు. అందుకే శివుడిని భక్తులు పరమేశ్వరుడిగా, పశుపతిగా ఆరాధిస్తారు.
News February 12, 2026
నీటి వసతి లేకుంటే పామాయిల్ సాగు వద్దు

ఆయిల్ పామ్ సాగును ఎలాంటి నేలల్లో చేపట్టినా నీటి వసతి ముఖ్యం. వర్షాధారంగా ఈ పంట సాగును చేపట్టలేము. అందుకే ఏ రైతైనా ఆయిల్ పామ్ సాగు చేయాలనుకుంటే నీటి వసతి ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పంట సాగు కోసం మొక్కకు రోజుకు 150 నుంచి 250 లీటర్ల నీరు అవసరం అవుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. బోర్వెల్ ఉంటే మైక్రోఇరిగేషన్ ద్వారా నీరు అందించి మంచి దిగుబడులను పొందవచ్చు.


