News April 6, 2024
మరికాసేపట్లో ‘మాస్ DJ’ అప్డేట్

‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న నిర్మాత నాగవంశీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇవాళ ఉదయం 11.07 గంటలకు మాస్ డీజే అప్డేట్ ఉంటుందని.. వెయిట్ చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే ‘టిల్లు స్క్వేర్’కు సీక్వెల్గా ‘టిల్లు క్యూబ్’ రానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రేజీ అప్డేట్ ఏమై ఉంటుందా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Similar News
News December 29, 2025
ఒక్క కాఫీతో కపుల్స్ గొడవలకు ఫుల్స్టాప్!

దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. గిల్లికజ్జాలు లేకపోతే ఆ సంసారంలో మజా ఉండదు అంటారు. అయితే ఒక్కోసారి మాటామాటా పెరిగి ఈగోకి పోతుంటారు. అది అస్సలు మంచిది కాదని ఫ్యామిలీ కౌన్సిలర్లు హెచ్చరిస్తున్నారు. ‘ఎలాంటి గొడవైనా మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సాయంత్రం ఒక మంచి కాఫీ పెట్టుకుని ఇద్దరూ కూర్చొని మనసు విప్పి మాట్లాడుకుంటే ఏ గొడవైనా ఇట్టే సాల్వ్ అవుతుంది’ అని సూచిస్తున్నారు.
News December 29, 2025
ALERT: పెరగనున్న కార్ల ధరలు!

కొత్త ఏడాదిలో కారు కొనాలనుకునే వారికి వాహన తయారీ సంస్థలు షాకిచ్చాయి. ముడిసరుకుల ధరలు, నిర్వహణ వ్యయం పెరగడంతో జనవరి తొలివారంలో కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమయ్యాయి. సుజుకీ, హ్యుందాయ్, MG, టాటా, మహీంద్రా, మెర్సిడెస్ బెంజ్ వంటి సంస్థలు మోడల్ను బట్టి 1% నుంచి 3% వరకు ధరలను పెంచే అవకాశం ఉంది. అయితే ఇయర్ ఎండ్ సేల్స్లో భాగంగా ఈ సంస్థలు భారీ డిస్కౌంట్స్తో అమ్మకాలు జరుపుతున్న విషయం తెలిసిందే.
News December 29, 2025
ఇతిహాసాలు క్విజ్ – 111 సమాధానం

ఈరోజు ప్రశ్న: మహాభారతంలో పాండవుల కోసం మయసభను నిర్మించింది ఎవరు? రామాయణంలో ఆయన పాత్ర ఏంటి?
సమాధానం: మహాభారతంలో పాండవుల కోసం అద్భుతమైన మయసభను నిర్మించింది మయాసురుడు. ఈయన గొప్ప అసుర శిల్పి. రామాయణంలో ఈయన రావణుడికి మామగారు. రావణుడి భార్య మండోదరి తండ్రి మయాసురుడే. ఆయన రామాయణ కాలంలో అసురులకు భవనాలు, నగరాలను నిర్మించే శిల్పిగా కూడా ప్రసిద్ధుడు.
<<-se>>#Ithihasaluquiz<<>>


