News December 22, 2024
మాస్ మైగ్రేషన్ తప్పదు!: నారాయణమూర్తి

వాతావరణ మార్పుల వల్ల 20-25 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించలేని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని Infosys నారాయణ మూర్తి హెచ్చరించారు. ఈ పరిస్థితులు ఇప్పటికే అధిక జనసాంద్రత కలిగిన B’lore, Pune, HYD నగరాల వైపు ప్రజల మాస్ మైగ్రేషన్కు దారితీయవచ్చన్నారు. ఇది ఈ నగరాల్లోని మౌలిక వనరులపై ఒత్తిడి పెంచుతుందని, అందువల్ల నేతలు, అధికారులు, కార్పొరేట్ లీడర్లు మేల్కోవాలన్నారు.
Similar News
News December 30, 2025
నువ్వుల పంటపై పేనుబంక ప్రభావం – నివారణ

నువ్వుల పంట వేసిన 25 రోజుల నుంచి పంటలో ఈ పురుగు ఆశించడం జరుగుతుంది. పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం ద్వారా ఆకులు పాలిపోయి తర్వాత ఎండిపోతాయి. వాటి ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల నుంచి తేనె లాంటి జిగురు పదార్థం విడుదలై మొక్క చుట్టుపక్కల చీమలు చేరతాయి. ఈ పురుగు నివారణకు ఇమిడాక్లోఫ్రిడ్ 0.3ml లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
News December 30, 2025
2025: క్రీడల్లో మన సివంగులదే డామినేషన్

ఈ ఏడాది క్రీడల్లో భారత మహిళలు సత్తా చాటారు. వన్డే WC, తొలి అంధుల మహిళా టీ20 ప్రపంచకప్ మన ఆడబిడ్డలే గెలుచుకున్నారు. కబడ్డీ WCను దక్కించుకున్నారు. ఇక ఫిడే ఉమెన్స్ గ్రాండ్ స్విస్ 2025 ఛాంపియన్గా వైశాలి నిలిచారు. హాకీ ఆసియా కప్, అథ్లెటిక్స్, వరల్డ్ బాక్సింగ్ కప్లోనూ భారత నారీమణులు ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. రెట్టించిన ఉత్సాహంతో వచ్చే ఏడాదికి సరికొత్త లక్ష్యాలను నిర్దేశించారు.
News December 30, 2025
అలా సందుల్లో దూరడం విజ్ఞత అనిపించుకోదు.. సజ్జనార్ స్వీట్ వార్నింగ్

TG: న్యూ ఇయర్ వేడుకల వేళ యువతకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. చౌరస్తాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయనే భయంతో సందుల్లో దూరి, ప్రమాదకరంగా వాహనాలు నడపడం విజ్ఞత అనిపించుకోదని స్పష్టం చేశారు. మద్యం మత్తులో వాహనం నడపడం మృత్యువును ఆహ్వానించడమేనని, ఒకవేళ యముడు వదిలేసినా చట్టం వదలదన్నారు. ‘మీ ప్రాణం విలువ మాకు తెలుసు. కాబట్టే ఈ హెచ్చరిక’ అని ట్వీట్ చేశారు.


