News August 19, 2025

కాంగోలో మారణకాండ.. 52 మందిని నరికి చంపారు

image

కాంగోలో అల్లైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్(ADF) మారణకాండకు పాల్పడింది. ఇస్లామిక్ స్టేట్ మద్దతున్న ఈ గ్రూప్ ఈనెల 9-16 మధ్య దాదాపు 52 మంది సివిలియన్లను కిరాతకంగా నరికి చంపినట్లు UN వెల్లడించింది. ADF మెంబర్స్ కొన్నేళ్లుగా కిడ్నాప్‌లు, చోరీలు, ఇళ్లు, వాహనాలు తగలబెట్టడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారు. వీరు ఉగాండా, కాంగో సరిహద్దుల్లో ఉంటూ నేరాలు చేస్తున్నారు. ADFపై US, UN ఇప్పటికే ఆంక్షలు విధించాయి.

Similar News

News August 19, 2025

జట్టు ఎంపికపై స్పందించిన అగార్కర్

image

ఆసియా కప్‌కు భారత జట్టు ఎంపిక కఠినంగా సాగిందని చీఫ్ సెలక్టర్ అగార్కర్ తెలిపారు. ‘అంచనాలు అందుకోవడంతోనే గిల్‌ను ఎంపిక చేశాం. అభిషేక్‌తో కలిసి గిల్, శాంసన్‌లో ఎవరూ ఓపెనింగ్ చేస్తారనేది ఇంకా డిసైడ్ చేయలేదు. శ్రేయస్ తప్పేం లేదు. అభిషేక్‌ బౌలింగ్ కూడా చేయగలడు. అందుకే జైస్వాల్‌‌ను కాదని అతడిని తీసుకున్నాం. కానీ జట్టులో 15 మందికే చోటు ఇవ్వగలం. 2026 T20 WCకి ఈ జట్టే ఫైనల్ కాదు’ అని చెప్పారు.

News August 19, 2025

రెడ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

image

TG: ఇవాళ ఆసిఫాబాద్ జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డితో పాటు ఇతర చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

News August 19, 2025

ఆసియా కప్: స్టార్ ప్లేయర్లకు షాక్

image

ఆసియా కప్ జట్టులో చోటు దక్కుతుందని ఆశించిన పలువురు టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్లకు నిరాశే ఎదురైంది. శ్రేయస్ అయ్యర్, KL రాహుల్‌కు చోటు దక్కలేదు. రెస్ట్ పేరిట సిరాజ్‌ను తీసుకోలేదు. ఈ ఏడాది IPLలో మెరిసిన ప్రసిద్, సుందర్, సుదర్శన్, శశాంక్, పరాగ్ వంటి యంగ్ ప్లేయర్లనూ ఎంపిక చేయలేదు. జైస్వాల్, ప్రసిద్, జురెల్, పరాగ్, సుందర్‌ను స్టాండ్‌బైగా పెట్టారు. సెలక్టర్లు ఎంపిక చేసిన <<17452199>>జట్టుపై<<>> మీ కామెంట్?