News March 30, 2025

భారీ ఎన్‌కౌంటర్: 20కు చేరిన మృతుల సంఖ్య

image

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శనివారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య 20కు చేరుకుంది. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత జగదీశ్ మృతి చెందినట్లు డిప్యూటీ సీఎం విజయ్ శర్మ వెల్లడించారు. గోగుండా కొండపై జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బందికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. భద్రత బలగాలు ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Similar News

News October 15, 2025

రేపు తెలంగాణ క్యాబినెట్ సమావేశం

image

TG: CM రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం రేపు మ.3 గం.కు సమావేశం కానుంది. ప్రధానంగా BC రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, మెట్రో రైలు ప్రాజెక్ట్, ధాన్యం సేకరణ, మూసీ ప్రాజెక్ట్, టీ-ఫైబర్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ అంశాలు చర్చకు రానున్నాయి. మేడిగడ్డ ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనుల అంశం, సమ్మక్క-సారలమ్మ ఆనకట్ట, తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం వంటి అంశాలూ చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

News October 15, 2025

ఇతిహాసాలు క్విజ్ – 36

image

1. దశరథుడి తల్లి పేరేంటి?
2. పాండవులు అజ్ఞాతవాసం ఎన్నేళ్లు చేశారు?
3. విష్ణువు ధనస్సు పేరేంటి?
4. తెలంగాణలోని ‘భద్రాచలం’ ఆలయం ఏ నది ఒడ్డున ఉంది?
5. శుక అంటే ఏ పక్షి?
* సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 15, 2025

L.C.A-625 మిరప రకం ప్రత్యేకలు ఇవే

image

ఎండు మిరప కింద సాగుకు ఈ రకం అనువైనది. ఈ రకం మొక్కలు ఎత్తైన కొమ్మలతో బలంగా పెరుగుతాయి. కణుపులు దగ్గరగా ఉండి కాయలు ఎక్కువగా కాస్తాయి. కాయలు సన్నగా, మధ్యస్థ పొడవు (8-10 సెం.మీ.) ఉండి.. తేజ రకాన్ని పోలి ఉంటాయి. పచ్చికాయలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. సూటి రకాల్లో కెల్లా అధిక ఘాటుతో పాటు ఆకర్షణీయమైన ఎరుపు రంగులో ఉంటాయి. తాలు కాయలు చాలా తక్కువగా ఉంటాయి. కాయకుళ్లు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది.