News March 30, 2025
భారీ ఎన్కౌంటర్: 20కు చేరిన మృతుల సంఖ్య

ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో శనివారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 20కు చేరుకుంది. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత జగదీశ్ మృతి చెందినట్లు డిప్యూటీ సీఎం విజయ్ శర్మ వెల్లడించారు. గోగుండా కొండపై జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బందికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. భద్రత బలగాలు ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Similar News
News April 1, 2025
హైదరాబాద్లో జర్మనీ యువతిపై గ్యాంగ్ రేప్

TG: హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని పహాడీషరీఫ్ ప్రాంతంలో జర్మనీ దేశానికి చెందిన యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. లిఫ్ట్ ఇస్తామని ఆమెను కారులో ఎక్కించుకున్న దుండగులు మార్గంమధ్యలో ఘాతుకానికి పాల్పడ్డారు. ఘటన అనంతరం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 1, 2025
ఒత్తిడి వల్ల లంచ్ చేయలేదు: అశ్వనీ కుమార్

IPLలో ఆడిన తొలి మ్యాచ్లోనే 4 వికెట్లతో సత్తా చాటిన MI బౌలర్ అశ్వనీ కుమార్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తొలి మ్యాచ్ కావడం వల్ల ఒత్తిడితో లంచ్ చేయలేదని, కేవలం అరటి పండు తిన్నట్లు చెప్పారు. మంచి ప్రదర్శన ఇవ్వడానికి తాను కొంత ప్లాన్ చేసుకోగా, జట్టు ఫుల్ సపోర్ట్ ఇచ్చిందన్నారు. షార్ట్ లెంగ్త్తో పాటు బ్యాటర్ల బాడీని టార్గెట్ చేస్తూ బంతులు వేయాలని కెప్టెన్ హార్దిక్ సూచించారని అశ్వనీ తెలిపారు.
News April 1, 2025
భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్స్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రంప్ రేపు టారిఫ్లపై తుది నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తం అయ్యారు. సెన్సెక్స్ 450pts, నిఫ్టీ 100pts నష్టాలతో మొదలయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 77,400, నిఫ్టీ 23,539 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. IT, Tech రంగాలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.