News December 1, 2024
ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం

TG: ములుగు జిల్లా ఏటూరునాగారంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. తెలంగాణ గ్రే హౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. మృతుల్లో మావోయిస్టు కీలక నేత బద్రు సహా ఇతరులు ఉన్నట్లు సమాచారం.
Similar News
News January 22, 2026
వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్!

బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు ఉండనున్నాయి. జనవరి 24 (నాలుగో శనివారం), 25 (ఆదివారం), 26 (గణతంత్ర దినోత్సవం) సెలవులు కాగా 27(మంగళవారం)న సమ్మె జరగనుంది. వారానికి ఐదు పని దినాలు ఉండాలని డిమాండ్ చేస్తూ బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే ఈ రోజుల్లో డిజిటల్, ఏటీఎం సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదు. ఏమైనా బ్యాంక్ పనులుంటే ఇవాళ, రేపు ప్లాన్ చేసుకోవడం మేలు.
News January 22, 2026
సన్స్క్రీన్ ఎలా వాడాలంటే?

కాలంతో సంబంధం లేకుండా సన్స్క్రీన్ రోజూ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్స్క్రీన్ను ముఖం, మెడకు రాయాలి. బయటికి వెళ్లేందుకు 15నిమిషాల ముందు రాసుకోవాలి. తేమ ఎక్కువగా ఉన్నా, చెమట పట్టినప్పుడు, స్విమ్మింగ్ తర్వాత సన్స్క్రీన్ మళ్లీ రాసుకోవాలి. సున్నితమైన చర్మం ఉన్నవారు జింక్ ఆక్సైడ్ లేదా టైటానియం డయాక్సైడ్ ఉండే మినరల్-బేస్డ్ సన్స్క్రీన్లను వాడడం మంచిదని సూచిస్తున్నారు.
News January 22, 2026
రేపు వసంత పంచమి.. చిన్నారులతో ఇలా చేయిస్తున్నారా?

వసంత పంచమి నాడు పిల్లలకు తెలుపు/పసుపు దుస్తులు ధరింపజేసి ఓంకారంతో అక్షరాభ్యాసం చేయిస్తే సరస్వతీ దేవి కటాక్షంతో విద్యాబుద్ధులు సమకూరుతాయని పండితులు సూచిస్తున్నారు. ‘వారితో పలక, బలపం, పుస్తకాలకు పూజ చేయించాలి. తద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ‘‘సరస్వతీ నమస్తుభ్యం’’ పఠిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది’ అని చెబుతున్నారు. వసంత పంచమి పూజ, అక్షరాభ్యాస ముహూర్తం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.


