News February 23, 2025
భారత్తో మ్యాచ్.. పాకిస్థాన్కు బిగ్ షాక్?

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. కాగా ఈ మ్యాచ్కు పాక్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజమ్ దూరమవుతున్నట్లు తెలుస్తోంది. కంటి దురద కారణంగా ఆయన నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్కు దూరమయ్యారు. దీంతో ఇవాళ మ్యాచ్ ఆడేది అనుమానంగా మారింది. ఇప్పటికే వెన్నునొప్పి కారణంగా ఆ జట్టు ఓపెనర్ ఫఖర్ జమాన్ టోర్నీ నుంచి వైదొలిగారు. బాబర్ ఆడకపోతే పాకిస్థాన్కు పెద్ద ఎదురుదెబ్బే.
Similar News
News February 23, 2025
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్ పేపర్-2 (BArch&B.Planning) ఫలితాలను NTA విడుదల చేసింది. <
News February 23, 2025
గ్రూప్-2 వివాదంలో ఎవరి పాత్ర ఎంతంటే?: ఎమ్మెల్సీ చిరంజీవి

AP: గ్రూప్-2 వివాదంలో జగన్ పాత్రే అధికంగా ఉందని టీడీపీ MLC చిరంజీవి ఆరోపించారు. నోటిఫికేషన్ రావడం, రోస్టర్లో తప్పులు, హైకోర్టులో కేసులు జగన్ హయాంలోనే జరిగాయని దుయ్యబట్టారు. మెయిన్స్ FEB 23న పెట్టాలని హైకోర్టు సూచిస్తే విద్యార్థులు నష్టపోయే అవకాశముందని వాయిదా వేయాలని CBN కోరినట్లు తెలిపారు. పరీక్ష వాయిదాతో టీడీపీకి లబ్ధి అని YCP ఫిర్యాదు చేయగా రద్దు కుదరదని APPSC తేల్చినట్లు పేర్కొన్నారు.
News February 23, 2025
ముగిసిన గ్రూప్-2 ఎగ్జామ్

AP: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 నిర్వహించారు. మొత్తం 175 కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరిగాయి. 92,250 మంది మెయిన్స్కు క్వాలిఫై కాగా 79,599 మంది పరీక్షలు రాశారు. వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు, ప్రభుత్వం కోరినా APPSC వెనక్కి తగ్గకుండా నిర్వహించింది. మరి మీరు ఈ ఎగ్జామ్ రాశారా? క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది? కామెంట్ చేయండి.