News March 24, 2024
ముంబై రంజీ ప్లేయర్లకు పెరగనున్న మ్యాచ్ ఫీజులు

రంజీ ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులు పెంచాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. BCCI ఇస్తున్న ఫీజులకు సమానంగా తాము కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో నెక్స్ట్ సీజన్ నుంచి ఆ జట్టు ప్లేయర్లు డబుల్ అమౌంట్ అందుకోనున్నారు. ప్రస్తుతం మ్యాచుల అనుభవాన్ని బట్టి ప్లేయర్లకు రోజుకు ₹20K-₹60K వరకు BCCI చెల్లిస్తోంది. ఇప్పుడు MCA ఇచ్చే మొత్తంతో కలిపి ప్లేయర్లకు రోజుకు ₹40వేల నుంచి ₹1.20లక్షల వరకు వస్తాయి.
Similar News
News December 9, 2025
గొర్రెల ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

గొర్రెల మంద ఎదుగుదలలో ఆడగొర్రెలది కీలకపాత్ర. ఇది ఎంత బాగుంటే మంద అంత బాగుంటుంది. ఆడ గొర్రెలు త్వరగా ఎదిగి , సంతానోత్పత్తికి అనుకూలంగా మారే లక్షణం కలిగి ఉండాలి. మందలో పునరుత్పాదక శక్తి తగ్గిన, పళ్లు లేని గొర్రెలను ఏరివేయాలి. ఏడాది కంటే ఎక్కువ కాలం ఎదకి రాని గొర్రెలు, గొడ్డుమోతు జీవాలను మంద నుంచి ఏరివేసి, చూడి లేదా తొలిసారి ఈనిన గొర్రెలను కొంటే బాగుంటుంది. ఏటా ముసలి గొర్రెలను మంద నుంచి తీసేయాలి.
News December 9, 2025
‘ద్వార లక్ష్మీ పూజ’ ఎలా చేయాలి?

ఉదయాన్నే లేచి గడపను శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించాలి. 3 వత్తుల దీపం, బెల్లం, అటుకులు, తాంబూలం నైవేద్యంగా పెట్టాలి. గణేషుడిని నమస్కరించి సంకల్పం చెప్పుకోవాలి. వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ అష్టోత్తరాలు చదివి హారతి ఇవ్వాలి. దీపం కొండెక్కే వరకు ఉంచి, తర్వాత తొలగించాలి. పూజ పూర్తయ్యాక నిద్రపోవడం శుభకరం కాదు. పెళ్లికానివారు, ఇంటి, ఉద్యోగ సమస్యలు ఉన్నవారు ఈ పూజ చేయవచ్చు.
News December 9, 2025
IIIT కొట్టాయంలో ఉద్యోగాలు

<


