News March 24, 2024
ముంబై రంజీ ప్లేయర్లకు పెరగనున్న మ్యాచ్ ఫీజులు

రంజీ ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులు పెంచాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. BCCI ఇస్తున్న ఫీజులకు సమానంగా తాము కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో నెక్స్ట్ సీజన్ నుంచి ఆ జట్టు ప్లేయర్లు డబుల్ అమౌంట్ అందుకోనున్నారు. ప్రస్తుతం మ్యాచుల అనుభవాన్ని బట్టి ప్లేయర్లకు రోజుకు ₹20K-₹60K వరకు BCCI చెల్లిస్తోంది. ఇప్పుడు MCA ఇచ్చే మొత్తంతో కలిపి ప్లేయర్లకు రోజుకు ₹40వేల నుంచి ₹1.20లక్షల వరకు వస్తాయి.
Similar News
News November 5, 2025
ఐఐటీ గాంధీనగర్ 36 పోస్టులకు నోటిఫికేషన్

<
News November 5, 2025
న్యూయార్క్ మేయర్గా జోహ్రాన్ మమ్దానీ

అమెరికా ఆర్థిక రాజధాని అయిన న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మమ్దానీ (34) ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి ముస్లిం, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ శతాబ్దంలో అత్యంత పిన్న వయసులో న్యూయార్క్ మేయర్ అయిన ఘనత కూడా ఈయనదే. డెమొక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేసిన జోహ్రాన్ స్వతంత్ర అభ్యర్థి ఆండ్రూపై గెలిచారు. మమ్దానీ తల్లిదండ్రులు ఇండియాలో జన్మించారు.
News November 5, 2025
హన్స్రాజ్ కాలేజీలో ఉద్యోగాలు

ఢిల్లీలోని హన్స్రాజ్ కాలేజీ 24 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబర్ 21లోపు అప్లై చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా, మిగతా పోస్టులకు 32ఏళ్లు. వెబ్సైట్: https://hansrajcollege.ac.in/


