News June 25, 2024
బంగ్లాతో మ్యాచ్.. అఫ్గాన్ స్కోర్ ఎంతంటే?

సెమీస్ రేసులో బంగ్లాతో జరుగుతున్న కీలక మ్యాచులో అఫ్గాన్ బ్యాటర్లు తడబడ్డారు. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 115 రన్స్ మాత్రమే చేశారు. ఓపెనర్ గుర్బాజ్ ఒక్కడే 43 పరుగులతో రాణించాడు. చివరి ఓవర్లో రషీద్ 2 సిక్సర్లతో అలరించారు. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా వేయడంతో రన్స్ రాబట్టేందుకు అఫ్గాన్ బ్యాటర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. ప్రస్తుతం అక్కడ వర్షం పడుతోంది. మ్యాచ్ రద్దయితే అఫ్గాన్ SFకు వెళ్తుంది.
Similar News
News December 10, 2025
సుందర్ పిచాయ్తో మంత్రి లోకేశ్ భేటీ

US పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ గూగుల్ CEO సుందర్ పిచాయ్తో భేటీ అయ్యారు. విశాఖలో AI డేటా సెంటర్ పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్-సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ను ప్రోత్సహించాలన్నారు. సంస్థలో వీటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుందర్ పిచాయ్ తెలిపారు.
News December 10, 2025
IOCLలో 509 పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News December 10, 2025
దారిద్ర్య దహన గణపతి స్తోత్రం ఎందుకు పఠించాలి?

ఆర్థిక సమస్యలు, దారిద్ర్య బాధలను తొలగించుకోవడానికి ఈ స్తోత్రాన్ని పఠించాలని పండితులు సూచిస్తున్నారు. నిత్యం పఠిస్తే గణేశుని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెబుతున్నారు. ‘తలపెట్టిన పనులు అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. ఈ మహా మహిమాన్విత స్తోత్రాన్ని 45 రోజుల పాటు క్రమం తప్పకుండా పఠిస్తే, ఆ వంశంలో పది తరాల వరకు దారిద్ర్య బాధలుండవని శాస్త్రాలు చెబుతున్నాయి’ అని అంటున్నారు.


