News June 2, 2024
భారత్తో మ్యాచ్ అంటే మాకూ టెన్షనే: బాబర్

భారత్తో మ్యాచ్ అంటే తమకూ కాస్త టెన్షనే అని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్నారు. ‘భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగినా చర్చ భారీ స్థాయిలో ఉంటుంది. ఆటగాళ్లుగా మాకెంతో ఉత్సాహం ఉంటుంది. అదే సమయంలో తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అయితే కూల్గా ఆడితే విజయం వరిస్తుందని నమ్ముతా. అందుకు తగ్గట్లుగా సాధన చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. కాగా T20 WCలో భాగంగా ఇరు జట్ల మధ్య జూన్ 9న హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
Similar News
News April 8, 2026
అట్లీతో సినిమా.. అల్లు అర్జున్ షాకింగ్ లుక్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న AA22 సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్రానికి ‘రాకా’ అనే టైటిల్ను ఫిక్స్ చేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో అల్లు అర్జున్ గుండుతో షాకింగ్ లుక్లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తుండగా సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. బన్ని లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.
News April 8, 2026
వారం తర్వాత 45 డిగ్రీలకు టెంపరేచర్!

వారం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భారీగా పెరుగుతాయని వాతావరణ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ, కోస్తా సరిహద్దు ప్రాంతాల్లో 45 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. అలాగే జూన్ నెలలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 48 డిగ్రీలకు చేరుకోవచ్చని పేర్కొన్నారు. కాగా నిన్న ఏపీలోని పలు జిల్లాల్లో 43 డిగ్రీల
ఉష్ణోగ్రత నమోదైంది.
News April 8, 2026
ఇరాన్ను చూసి నేర్చుకోవాలి: MP మహువా

అంతర్జాతీయ రాజకీయాల్లో ఇరాన్ ప్రదర్శిస్తున్న ధైర్యాన్ని TMC ఎంపీ మహువా మొయిత్రా ప్రశంసించారు. ‘ధైర్యం, పట్టుదల అంటే ఏమిటో ఇరాన్ ప్రపంచానికి నేర్పింది’ అని ట్వీట్ చేశారు. భారత నాయకత్వం కూడా బెదిరింపులకు భయపడకుండా గట్టిగా వ్యవహరించాల్సిన సమయం వచ్చిందని ఆమె సూచించారు. మన దేశానికి సంబంధించి వాణిజ్య ఒప్పందాలు, ఇంధన విధానాలపై సొంతంగా, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.


