News September 20, 2025

భారత్‌తో మ్యాచ్.. పాక్ డ్రామా షురూ!

image

ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్‌ మధ్య రేపు సూపర్-4 మ్యాచ్ జరగనుంది. దీంతో ఇవాళ జరగాల్సిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ను పాక్ బాయ్‌కాట్ చేసింది. తొలి మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదని PCB అలకబూనిన విషయం తెలిసిందే. UAEతో మ్యాచ్ ఆడబోమంటూ పెద్ద <<17741773>>డ్రామానే<<>> చేసింది. చివరికి తోక ముడిచి మ్యాచ్ ఆడింది. రేపటి మ్యాచ్ నేపథ్యంలో మళ్లీ కొత్త నాటకానికి తెరలేపింది. దీంతో ఇరుదేశాల మధ్య ఆట ఉత్కంఠగా మారింది.

Similar News

News September 20, 2025

కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తా: పవన్

image

AP: కోనసీమలో సముద్రపు నీరు చేరి పాడైన కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తానని Dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ‘శంకరగుప్తం మేజర్ డ్రయిన్ వెంబడి ఉన్న గ్రామాల్లో కొబ్బరి తోటలు దెబ్బతిన్న విషయం నా దృష్టికి వచ్చింది. కేశనపల్లి, కరవాక, గొల్లపాలెం, గోగన్నమఠం, శంకరగుప్తం.. ఇలా 13 గ్రామాల రైతులు నష్టపోతున్నామని తెలిపారు. దసరా తర్వాత అక్కడికి వెళ్లి రైతాంగాన్ని కలిసి, తోటలు పరిశీలిస్తా’ అని ట్వీట్ చేశారు.

News September 20, 2025

రేపటి నుంచే సెలవులు.. హైవేపై రద్దీ

image

తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 22 నుంచి దసరా సెలవులు మొదలవనుండగా ఆదివారం కలిసి రావడంతో రేపటి నుంచే హాలిడేస్ ప్రారంభం కానున్నాయి. దీంతో HYD-విజయవాడ హైవే వాహనాల రాకపోకలతో కిటకిటలాడుతోంది. HYD నుంచి ఆంధ్రాకు, ఆంధ్రా నుంచి HYDకు రాకపోకలు సాగించేవారితో టోల్‌ప్లాజాల వద్ద రద్దీ నెలకొంది. ఇక ఏపీలో వచ్చేనెల 3న, టీజీలో 4న స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. అప్పటివరకు విద్యార్థులు సెలవులు ఎంజాయ్ చేయనున్నారు.

News September 20, 2025

17 మంది ఇంజినీర్లపై సీఎంకు ఏసీబీ నివేదిక

image

TG: TGSPDCL ఇంజినీర్ల అక్రమాలపై ACB ఫోకస్ పెట్టింది. ఇటీవల ADE <<17730161>>అంబేడ్కర్<<>> వద్ద రూ.వందల కోట్లు పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా మరో 17 మంది ఇంజినీర్ల అవినీతిపై CM రేవంత్‌కు ACB నివేదిక ఇచ్చింది. HYDలోని ఇబ్రహీంబాగ్, గచ్చిబౌలి, మేడ్చల్, రాజేంద్రనగర్, కందుకూరులో ADE, CE స్థాయుల్లో పనిచేసిన వీరు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని పేర్కొంది. బదిలీ విధానంలో ఇంజినీర్లకు ఆప్షన్లిచ్చి అడ్డగోలుగా పోస్టింగ్స్ ఇచ్చిన తీరును ప్రస్తావించింది.