News June 30, 2024
ఇకపై దిగ్గజాలు లేని మ్యాచ్లు

భారత క్రికెట్ ఫ్యాన్స్ ఇకపై రోహిత్, కోహ్లీ లేని టీ20 మ్యాచ్లు చూడాలి. ఈ WCలో రోహిత్, కోహ్లీ అనూహ్యంగా ఓపెనర్లుగా దిగారు. ఒకరు ఔటైనా మరొకరు జట్టును ముందుకు నడిపించి, విజయాల్లో కీలకపాత్ర పోషించారు. కప్ గెలిచిన తర్వాత ఈ దిగ్గజాలిద్దరూ కొత్త ఆటగాళ్లకు స్వాగతం పలుకుతూ పొట్టి ఫార్మాట్కు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇకమీదట టీ20ల్లో రోహిత్, కోహ్లీ వారసులుగా ఎవరు ఎదుగుతారనేది వేచిచూడాలి.
Similar News
News November 19, 2025
రిస్క్లో 350 కోట్లమంది వాట్సాప్ కాంటాక్ట్స్?

డేటా లీకేజీతో వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీ ప్రమాదంలో పడనున్నట్లు వియన్నా యూనివర్సిటీ హెచ్చరించింది. ఆ యూనివర్సిటీ రీసెర్చర్స్ వాట్సాప్లో భారీ భద్రతా లోపాన్ని గుర్తించారు. వరల్డ్ వైడ్గా ఉన్న 350 కోట్లమంది యూజర్ల కాంటాక్ట్స్ లీక్ అయ్యే ప్రమాదం ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చారు. హ్యాకర్లు లేదా వేరే వ్యక్తులు ఈ కాంటాక్ట్ నంబర్లను చోరీ చేసే అవకాశమున్నట్లు తెలిపారు.
News November 19, 2025
ICC అండర్-19 మెన్స్ WC షెడ్యూల్ విడుదల

ఐసీసీ మెన్స్ అండర్-19 వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారైంది. జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యంలో 2026 జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు టోర్నీ జరగనుంది. 16 టీమ్స్ నాలుగు గ్రూపులుగా విడిపోగా గ్రూపుAలో భారత్, USA, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉన్నాయి. ఇక్కడ టాప్ ప్రదర్శన చేసిన జట్లు సూపర్ సిక్స్కు, ఈ ప్రదర్శన ఆధారంగా సెమీస్ అనంతరం ఫైనల్ జట్లు ఖరారు కానున్నాయి. పూర్తి షెడ్యూల్ కోసం పైన స్లైడ్ చేయండి.
News November 19, 2025
నేషనల్-ఇంటర్నేషనల్ న్యూస్ రౌండప్

* గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్కి 11 రోజుల NIA కస్టడీ విధించిన పటియాలా కోర్టు
* భారత్ నుంచి షేక్ హసీనాను రప్పించేందుకు ఇంటర్పోల్ సహాయం తీసుకోవాలని యోచిస్తున్న బంగ్లాదేశ్
* టెర్రర్ మాడ్యూల్ కేసులో అల్ ఫలాహ్ వర్సిటీకి సంబంధించి వెలుగులోకి కీలక విషయాలు.. ఛైర్మన్ జావద్ సిద్దిఖీ కుటుంబీల కంపెనీలకు రూ.415 కోట్లు అక్రమంగా తరలించినట్లు గుర్తించిన ED


