News August 6, 2024
మథుర వివాదం: సుప్రీంలో హిందూపక్షం కేవియెట్

‘మథుర’ కేసులో హిందూ పక్షం లాయర్ విష్ణుశంకర్ జైన్ సుప్రీం కోర్టులో కేవియెట్ దాఖలు చేశారు. ఒకవేళ అలహాబాద్ హైకోర్టు తీర్పును ముస్లిం పక్షం సవాల్ చేస్తే తమ వాదనలను వినకుండా ఎలాంటి వ్యతిరేక ఆదేశాలు ఇవ్వొద్దని కోరారు. శ్రీకృష్ణ మందిరం- ఈద్గా మసీదుపై 18 కేసుల మెయింటెనబిలిటీపై వచ్చిన ఫిర్యాదులను ఆగస్టు 1న అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. మసీదు రిలీజియన్ క్యారెక్టర్ నిర్ధారించాల్సి ఉందని పేర్కొంది.
Similar News
News January 6, 2026
BREAKING: విజయ్కు సీబీఐ నోటీసులు

తమిళనాడు కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే చీఫ్, స్టార్ హీరో విజయ్కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ నెల 12న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించింది. గత ఏడాది సెప్టెంబర్ 27న టీవీకే సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే.
News January 6, 2026
రాష్ట్రంలో 424 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 6, 2026
సక్సెస్తో వచ్చే కిక్కే వేరు: CBN

AP: 2025లో పెట్టుబడులు అద్భుతంగా వచ్చాయని, అదే ఉత్సాహంతో 2026లోనూ ముందుకెళ్లాలని CM CBN SIPB సమావేశంలో సూచించారు. ‘టాటా, జిందాల్, బిర్లా, ADANI, RIL,TCS, కాగ్నిజెంట్ వంటివి పెట్టుబడులు పెడుతున్నాయి. గ్రౌండింగ్లో పొరపాట్లకు తావుండొద్దు. 2029కి విద్యుత్ కొనుగోలు ఛార్జీ ₹3.70కి తగ్గేలా చేద్దాం’ అని పేర్కొన్నారు. సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుందని, దాని కోసం అందరూ పని చేయాలని వ్యాఖ్యానించారు.


