News April 28, 2024

వర్జీనియా పొగాకుకు గరిష్ఠ ధర

image

వర్జీనియా పొగాకుకు మంచి ధర లభిస్తోంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం-2లో నిన్న కిలో ధర రూ.341 పలికింది. మొన్న రూ.319 ధర రాగా.. నిన్న రూ.22 అత్యధికంగా లభించింది. దీంతో భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట రైతులు ఈ ధరలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కనిష్ఠంగా రూ.235 ధర పలికింది. వర్జీనియా పొగాకు ఇంత ధర పలకడం ఇదే తొలిసారి.

Similar News

News December 10, 2025

సుందర్ పిచాయ్‌తో మంత్రి లోకేశ్ భేటీ

image

US పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ గూగుల్ CEO సుందర్ పిచాయ్‌తో భేటీ అయ్యారు. విశాఖలో AI డేటా సెంటర్ పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్-సర్వర్ తయారీ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించాలన్నారు. సంస్థలో వీటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుందర్ పిచాయ్ తెలిపారు.

News December 10, 2025

IOCLలో 509 పోస్టులకు నోటిఫికేషన్

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<>IOCL<<>>) ఈస్ట్రన్ రీజియన్‌లో 509 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు నేటి నుంచి జనవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు NATS/NAPS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్:io cl.com/

News December 10, 2025

దారిద్ర్య దహన గణపతి స్తోత్రం ఎందుకు పఠించాలి?

image

ఆర్థిక సమస్యలు, దారిద్ర్య బాధలను తొలగించుకోవడానికి ఈ స్తోత్రాన్ని పఠించాలని పండితులు సూచిస్తున్నారు. నిత్యం పఠిస్తే గణేశుని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెబుతున్నారు. ‘తలపెట్టిన పనులు అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. ఈ మహా మహిమాన్విత స్తోత్రాన్ని 45 రోజుల పాటు క్రమం తప్పకుండా పఠిస్తే, ఆ వంశంలో పది తరాల వరకు దారిద్ర్య బాధలుండవని శాస్త్రాలు చెబుతున్నాయి’ అని అంటున్నారు.