News January 29, 2025
తొక్కిసలాటపై మాయావతి దిగ్ర్భాంతి

మహా కుంభమేళాలో తొక్కిసలాట జరగడంపై BSP చీఫ్ మాయావతి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. అర్ధరాత్రి జరిగిన తొక్కిసలాటలో పలువురు చనిపోయినట్లు అధికారిక ప్రకటన రాలేదు. ఈక్రమంలోనే మృతులకు సంతాపం తెలియజేస్తున్నానని మాయావతి ట్వీట్ చేయడం గమనార్హం.
Similar News
News December 8, 2025
ఫ్యూచర్ సిటీలోని ప్రదర్శన స్టాల్ వద్ద సందడి!

ఫ్యూచర్ సిటీలో ప్రదర్శన స్టాల్ ముఖ్య ఆకర్షణగా నిలిచింది. మీర్ఖాన్పేటలో ప్రతిపాదించిన ఈ భవిష్యత్తు నగర ప్రణాళికలను డిజిటల్ విజువల్స్ ద్వారా ప్రదర్శించారు. వంపు ఆకృతి నిర్మాణంతో కూడిన ఈ స్టాల్లో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ను అధికారులు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్టాల్ను సందర్శించారు.
News December 8, 2025
ఆ రెండు రోజులు స్కూళ్లకు సెలవులు!

TGలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఈ నెల 11,14,17 తేదీల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. తొలి విడతలో 4,236, రెండో విడతలో 4,333, మూడో విడతలో 4,159 గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటి కోసం గ్రామాల్లోని స్కూళ్లలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 14న ఆదివారం కాగా 11,17న పోలింగ్ జరిగే స్కూళ్లకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే ప్రకటన రావచ్చు.
News December 8, 2025
YCP కక్షపూరిత రాజకీయాలతో ఖజానాకు నష్టం: CM

AP: YCP కక్షపూరిత రాజకీయాలతో గతంలో ప్రజాధనం నష్టమైందని CM CBN విమర్శించారు. ‘PPAల రద్దుతో విద్యుత్ వాడకుండానే ₹9వేల కోట్లు కట్టాల్సి వచ్చింది. మూలధన వ్యయం లేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఆస్తుల్నే కాకుండా భవిష్యత్తు ఆదాయాన్నీ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. ఎంత కష్టమైనా సరే హామీలను నెరవేరుస్తున్నాం. ఆగిన పథకాలను పునరుద్ధరించాం’ అని CM వివరించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు తెలిపారు.


