News July 5, 2024
టీడీపీలో చేరిన చిత్తూరు మేయర్, డిప్యూటీ మేయర్

AP: చిత్తూరులో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. నగర మేయర్ ఆముద, డిప్యూటీ మేయర్ రాజేశ్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ నుంచి 46 మంది, టీడీపీ నుంచి ముగ్గురు, ఇండిపెండెంట్గా ఒకరు గెలిచారు. ప్రస్తుత చేరికలతో సంఖ్యా బలం మారుతోంది.
Similar News
News October 28, 2025
బరితెగించారు.. పోర్న్ సైట్లలో చిరంజీవి డీప్ ఫేక్ వీడియో

మెగాస్టార్ చిరంజీవి విషయంలో సైబర్ నేరగాళ్లు బరితెగించారు. ఆయన డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి ఏకంగా పోర్న్ సైట్లలో పెట్టారు. ఆయన ఓ మహిళతో ఇంటిమేట్ సీన్లలో పాల్గొన్నట్లు AI వీడియోలు క్రియేట్ చేసి ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేశారు. దీంతో నిందితులను అరెస్ట్ చేయాలంటూ చిరంజీవి CP సజ్జనార్ను కోరారు. ఇది తన గౌరవానికి భంగం కలిగించిందని ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News October 28, 2025
రాష్ట్రంలో మెగా జాబ్ మేళా

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తుళ్లూరులోని CRDA ఆఫీస్, స్కిల్ హబ్ వద్ద రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 10 మల్టీ నేషనల్ కంపెనీలు 400 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. నిరుద్యోగ అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రెజ్యూమ్, సర్టిఫికెట్లు తీసుకుని ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.
News October 28, 2025
నిత్యారాధన ఫలితాలు

శివ మహాపురాణం ప్రకారం.. నిత్యారాధన విశేష ఫలితాలనిస్తుంది. ఆదివారం సూర్యారాధన నేత్ర, శిరో, చర్మ రోగాలను పోగొడుతుంది. అన్నదానం చేయడం శుభకరం. సంపద కోసం సోమవారం లక్ష్మీదేవిని, రోగ నివారణకై మంగళవారం కాళిని, కుటుంబ క్షేమం కోసం బుధవారం విష్ణువును, ఆయువుకై గురువారం, భోగాలకై శుక్రవారం సకల దేవతలను, అపమృత్యువు నివారణకై శనివారం రుద్రాది దేవతలను పూజించాలి. ఈ నిత్యారాధనలు మనకు సకల శుభాలు కలిగిస్తాయి. <<-se>>#SIVOHAM<<>>


