News July 5, 2024

టీడీపీలో చేరిన చిత్తూరు మేయర్, డిప్యూటీ మేయర్

image

AP: చిత్తూరులో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. నగర మేయర్ ఆముద, డిప్యూటీ మేయర్ రాజేశ్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ నుంచి 46 మంది, టీడీపీ నుంచి ముగ్గురు, ఇండిపెండెంట్‌గా ఒకరు గెలిచారు. ప్రస్తుత చేరికలతో సంఖ్యా బలం మారుతోంది.

Similar News

News July 8, 2024

డ్రగ్స్ టెస్టులో నెగటివ్ వచ్చింది: నటి హేమ

image

బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడటంతో నటి హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని ‘మూవీ ఆర్టిస్టు అసోసియేషన్’ రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి లేఖ అందించారు. షోకాజు నోటీసు ఇవ్వకుండా తనని మా సభ్యత్వం నుంచి తొలగించడం అన్యాయం అని వాపోయారు. డ్రగ్స్ టెస్ట్ రిపోర్టులో తనకు నెగటివ్ వచ్చిందని, మళ్లీ ‘మా’లో తన సభ్యత్వాన్ని కొనసాగించాలని అభ్యర్థించారు. తనకి సపోర్ట్ చేయాలని కోరారు.

News July 8, 2024

శివుడి ఆశీస్సులతో కూతురికి పేరు: మనోజ్

image

ఎనర్జిటిక్ హీరో మంచు మనోజ్ భార్య మౌనిక రెండు నెలల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తమ గారాలపట్టికి దేవసేన శోభాగా నామకరణం చేసినట్లు మనోజ్ ట్వీట్ చేశారు. పరమశివుడి ఆశీస్సులతో పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో కుటుంబంతో దిగిన ఫొటోను ఆయన పంచుకున్నారు.

News July 8, 2024

పిన్నెల్లిని కస్టడీకి తీసుకున్న పోలీసులు

image

AP: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలో నెల్లూరు సెంట్రల్ జైలులో విచారిస్తున్నారు. సీఐపై దాడి, ఈవీఎం ధ్వంసంతో పాటు దాడుల్లో ఎవరెవరు పాల్గొన్నారనే అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.