News February 14, 2025

వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో MBiPC

image

AP: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్‌‌లో ఎంబైపీసీ(ఎంపీసీ, బైపీసీ) కోర్సు అమలుకు విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ కోర్సు చదివిన వారు ఇంజినీరింగ్ లేదా మెడిసిన్‌లలో ఏదైనా కోర్సులో జాయిన్ కావొచ్చు. గణితం ఒకే సబ్జెక్టుగా, బోటనీ-జువాలజీ కలిసి బయాలజీగా మార్పు చేయనున్నారు. మొదటి సబ్జెక్టుగా ఇంగ్లిష్‌తో కలిపి 5 సబ్జెక్టులు, ఆరోది ఆప్షనల్‌గా ఉండనుంది. ఆర్ట్స్ గ్రూపుల్లో అయితే 5 సబ్జెక్టులే ఉంటాయి.

Similar News

News December 20, 2025

విద్యార్థులే రాష్ట్రానికి పెద్ద ఆస్తి: CBN

image

AP: విద్యార్థులే రాష్ట్రానికి పెద్ద ఆస్తి అని CM CBN పేర్కొన్నారు. వారంతా నాలెడ్జి ఎకానమీలో భాగం కావాలని సూచించారు. విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత మెరుగుపరిచేలా రాష్ట్రంలో ‘ముస్తాబు’ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే 75 లక్షల మంది ఆరోగ్యాన్ని పరీక్షిస్తామని చెప్పారు. కష్టపడి చదివితే లక్ష్యాన్ని సాధిస్తారన్నారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం స్కూలు విద్యార్థులతో CM మాట్లాడారు.

News December 20, 2025

నేలలో అతి తేమతో పంటకు ప్రమాదం

image

పంట ఎదుగుదలకు నేలలో తగినంత తేమ అవసరం. అయితే పరిమితికి మించి తేమ, నీరు నిల్వ ఉంటే మాత్రం నేలలో గాలి ప్రసరణ తగ్గి, వేర్లకు ఆక్సిజన్ అందక శ్వాసప్రక్రియ మందగిస్తుంది. దీని వల్ల వేర్లు కుళ్లి, తెగుళ్లు ఆశించి మొక్క ఎదుగుదల నిలిచిపోయి పంట దిగుబడి తగ్గుతుంది. తేమ మరీ ఎక్కువైతే మొక్కలు చనిపోతాయి. టమాటా, మిర్చి, వంకాయ, కీరదోస, బత్తాయి, ద్రాక్షల్లో అధిక తేమతో వేరుకుళ్లు సహా ఇతర సమస్యల ముప్పు పెరుగుతుంది.

News December 20, 2025

పాటియాలా లోకోమోటివ్ వర్క్స్‌లో 225 పోస్టులు

image

<>పాటియాలా<<>> లోకోమోటివ్ వర్క్స్‌లో 225 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్, ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణులు అప్లై చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు 24ఏళ్లు. www.apprenticeshipindia.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విద్యార్హతలో మెరిట్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://plw.indianrailways.gov.in