News February 14, 2025

వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో MBiPC

image

AP: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్‌‌లో ఎంబైపీసీ(ఎంపీసీ, బైపీసీ) కోర్సు అమలుకు విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ కోర్సు చదివిన వారు ఇంజినీరింగ్ లేదా మెడిసిన్‌లలో ఏదైనా కోర్సులో జాయిన్ కావొచ్చు. గణితం ఒకే సబ్జెక్టుగా, బోటనీ-జువాలజీ కలిసి బయాలజీగా మార్పు చేయనున్నారు. మొదటి సబ్జెక్టుగా ఇంగ్లిష్‌తో కలిపి 5 సబ్జెక్టులు, ఆరోది ఆప్షనల్‌గా ఉండనుంది. ఆర్ట్స్ గ్రూపుల్లో అయితే 5 సబ్జెక్టులే ఉంటాయి.

Similar News

News December 13, 2025

చేపల చెరువుల్లో నీటి పీహెచ్ స్థాయి ఎంత ఉండాలి?

image

☛ చేపలు ఎక్కువగా పీహెచ్ స్థాయి 7.0-8.5 మధ్య ఉన్న చెరువు నీటిలో బాగా పెరుగుతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 6.5 కన్నా తక్కువైతే (ఆమ్ల ధర్మం గల నీరు) చేపలు బలహీనమై, వ్యాధుల బారినపడతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 9 కన్నా ఎక్కువైతే (క్షార ధర్మం గల నీరు) చేపల మొప్పలు దెబ్బతిని, ప్రాణ వాయువుని గ్రహించే శక్తి చేపల్లో తగ్గుతుంది. అందుకే నీటి పీహెచ్ స్థాయిని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.

News December 13, 2025

గుమ్మడి దీపం పెడుతూ పఠించాల్సిన శ్లోకం..

image

కూష్మాండో బలిరూపేణ మమ భాగ్యాదవస్థితాః
ప్రణమామి తతస్సర్వ రూపిణం బలి రూపిణం
‘నేను బూడిద గుమ్మడికాయను బలిగా సమర్పిస్తున్నాను. ఫలితంగా నా జీవితంలో అదృష్టం, శుభం స్థిరంగా ఉంటాయి. ఈ బలి రూపాన్ని ధరించిన దైవ శక్తికి, అలాగే ఎన్నో రూపాల్లో ఉన్న ఆ శక్తికి నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను’ అని చెప్పి కూష్మాండ దీపం వెలిగించాలి. తద్వారా ఆర్థిక, గ్రహ, కుటుంబ సమస్యల నుంచి రక్షణ లభిస్తుందని నమ్మకం.

News December 13, 2025

పొగమంచు, డ్రైవర్ అతివేగంతోనే ప్రమాదం: క్షతగాత్రులు

image

AP: అల్లూరి జిల్లాలో జరిగిన రోడ్డు <<18540788>>ప్రమాదానికి<<>> డ్రైవర్ మధు అతివేగమే కారణమని క్షతగాత్రులు వెల్లడించారు. పొగమంచుతో రోడ్డు సరిగ్గా కనిపించకపోయినా మలుపుల వద్ద వేగంగా తిప్పడంతో నియంత్రించలేకపోయాడని తెలిపారు. నిద్ర నుంచి తేరుకునేలోపే 9 మంది చనిపోయారన్నారు. అయితే ప్రమాదానికి ముందు బ్రేక్ పడట్లేదని మధు చెప్పాడని, ఇంతలోనే ప్రమాదం జరిగిందని మరో డ్రైవర్ ప్రసాద్ చెప్పారు.