News April 19, 2024
MBNRకు 6.. నాగర్ కర్నూల్కు 3 నామినేషన్లు
ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల్లో మొత్తం 9 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. NGKLకు తొలిరోజు భరత్ ప్రసాద్(BJP), మల్లురవి(INC) నామినేషన్ వేయగా, 2వ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(BRS) నామినేషన్ వేశారు. MBNRకు తొలిరోజు డీకే అరుణ(BJP) నామినేషన్ వేయగా.. 2వ రోజు వంశీచంద్ రెడ్డి(INC), మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS)తోపాటు 3 స్వతంత్ర అభ్యర్థులు హరేందర్ రెడ్డి, సరోజనమ్మ, ఉమాశంకర్ నామినేషన్ చేశారు.
Similar News
News October 1, 2024
శ్రీశైలంలో 880.4 అడుగుల నీటిమట్టం
శ్రీశైలం జలాశయంలో సోమవారం నీటిమట్టం 880.4 అడుగుల వద్ద 190.3330 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ ఉన్న జూరాల, సుంకేసుల ద్వారా మొత్తం 81,607 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది.ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో 16.335 M.U విద్యుదుత్పత్తి చేస్తూ 36,163 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో 5.356 M.U ఉత్పత్తి చేస్తూ 22,197 మొత్తం 58,360 క్యూసెక్కుల నీటిని దిగువున సాగర్ కు విడుదల చేస్తున్నారు.
News October 1, 2024
MBNR: జూ.అధ్యాపకుల ఎదురుచూపులు..!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీఎస్సీలో ఎంపికైన వారికి ఈనెల 9న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయనున్నారు. ప్రభుత్వం కేవలం 55 రోజుల్లో డీఎస్సీ ఫలితాలను వెల్లడించి 10 రోజుల్లో నియామక పత్రాలు అభ్యర్థులకు అందించనుంది. కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్ అధ్యాపకుల భర్తీని పట్టించుకోవడంలేదని ఎంపికైన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియామక పత్రాల కోసం ఎంపికైన వారు ఎదురుచూస్తున్నారు.
News October 1, 2024
NRPT: డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన తండ్రీకొడుకులు
డీఎస్సీ ఫలితాల్లో నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండ గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు సత్తాచాటారు. 50ఏళ్ల వయసులో రాకొండకు చెందిన జంపుల గోపాల్ తెలుగు పండిట్ కేటగిరిలో జిల్లాస్థాయిలో మొదటి ర్యాంకు, స్కూల్ అసిస్టెంట్ విభాగంలో మూడో ర్యాంకు పొందారు. ఆయన కుమారుడు భానుప్రకాశ్ నారాయణపేట జిల్లా స్థాయిలో గణితంలో స్కూల్ అసిస్టెంట్ 9వ ర్యాంకు సాధించారు. దీంతో తండ్రీకొడుకులకు ప్రశంసలు వెల్లువెత్తాయి.