News January 29, 2025
MBNR:మన్యం కొండ జాతర ఏర్పాట్లపై సమీక్ష

మన్యం కొండ దేవస్థానం ప్రతిష్ఠను పెంచే విధంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి జాతర ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని ఐడిఓసిలో మన్యంకొండ జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్,SP డి.జానకి పాల్గొన్నారు.
Similar News
News October 30, 2025
పాలమూరు: నేడే.. డయల్ యువర్ డిఎం

ఆర్టీసీ సమస్యలపై మహబూబ్ నగర్ డిపో ఆధ్వర్యంలో ఇవాళ డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ సుజాత తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని ప్రయాణికులు తమ సమస్యలను సలహాలను, సూచనలను గురువారం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 వరకు తెలుపాలన్నారు. 99592 26295 చరవాణి నంబర్కు ఫోన్ చేసి సమస్యలను వివరించాలన్నారు. ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 30, 2025
MBNR: వర్షపాతం వివరాలు

మహబూబ్నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా భూత్పూర్ మండలం కొత్త మొల్గర 30.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. భూత్పూర్ 24.3, మూసాపేట మండలం జానంపేట 20.5, హన్వాడ 19.5, మహబూబ్ నగర్ అర్బన్ 17.0, మిడ్జిల్ 16.0, మహమ్మదాబాద్ 15.8, బాలానగర్ 13.3, దేవరకద్ర 12.8, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 10.8 అడ్డాకుల 8.5, మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.
News October 30, 2025
MBNR: వినియోగదారుల కోర్టులోకి వరద నీరు

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ప్రాంగణంలోని వినియోగదారుల కోర్టు ప్రాంగణంలో భారీ వర్షం కారణంగా నీరు చేరింది. 2 రోజుల కురిసిన వర్షంతో కోర్టు ప్రాంగణంలో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. వర్షం నీరు రాకుండా తగిన డ్రేనేజీ వ్యవస్థ లేనందున బుధవారం కూడా నీరు తగ్గకపోవడంతో కోర్టు కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కొత్త భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.


