News March 26, 2024
MBNR:గడువు పొడగింపు..దరఖాస్తుల ఆహ్వానం!
సాంఘిక,గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికిగాను 6-9 తరగతుల్లో ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించారని ఎస్సీ గురుకుల విద్యాలయాల మహబూబ్ నగర్ తూర్పు ప్రాంతీయ సమన్వయకర్త విద్యుల్లత తెలిపారు.ఆయా వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకొని సీట్లు కేటాయిస్తామని, అర్హులైన ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
Similar News
News October 3, 2024
ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎల్లో అలెర్ట్
ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.
News October 3, 2024
మక్తల్: డిజిటల్ హెల్త్ కార్డ్ పైలెట్ ప్రాజెక్టుకు ఎంపికైన గ్రామం ఇదే
రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా నేటి నుంచి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రికార్డు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. 119 నియోజకవర్గాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద హెల్త్ కార్డులు జారీ చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు. ఇందులో మక్తల్ నియోజకవర్గం ని ఊట్కూర్ మండలం కొత్తపల్లి గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక కాబడింది. ఈరోజు నుంచి గ్రామంలో ఈనెల 7 వరకు ఇంటింటి సర్వే ఃజరగనుంది.
News October 3, 2024
జూరాల గేట్లు మూసివేత
జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ ఫ్లో బుధవారం రాత్రి 9 గంటలకు 55,800 క్యూసెక్కులకు తగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు గేట్లను ఉదయం ముసివేసినట్లు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 41,039 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. దీంతో ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీ ప్రస్తుతం ప్రాజెక్టులో 9.418 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.