News April 1, 2025

MBNR:సన్నబియ్యం పంపిణీ షురూ..లబ్ధిదారుల ఖుషి

image

ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా తెల్లరేషన్‌ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ ఇవాళ షురూ అయింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం సన్నబియ్యం సంబరాల వాతావరణం నెలకొంది. ఉదయం 8గంటల నుంచే MBNR, NRPT, GDL, NGKL, WNP జిల్లాలలోని రేషన్‌ షాపులదగ్గర లబ్ధిదారులు బారులుతీరారు. రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 6కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నడంతో తెల్లరేషన్ కార్డుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 6, 2026

రాజానగరం: తొలిసారిగా ‘నన్నయ వర్సిటీ’కి ఫైవ్ స్టార్ గౌరవం

image

ఉన్నత విద్యారంగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి ప్రతిష్టాత్మకమైన ‘ఫైవ్ స్టార్ క్వాలిటీ రేటింగ్’ సర్టిఫికెట్ లభించింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో తొలిసారిగా నన్నయ వర్సిటీ ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకోవడం విశేషం. మంగళవారం అమరావతిలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ ఈ సర్టిఫికెట్‌ను వర్సిటీ వీసీ ప్రసన్నశ్రీకి అందజేసి అభినందించారు.

News January 6, 2026

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

image

AP: ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉండనున్నారు. కేంద్ర మంత్రులను కలిసి కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నియామకాలపై వినతి పత్రాలు ఇవ్వనున్నారు.

News January 6, 2026

సంక్షేమమే లక్ష్యం.. అబ్కారీ శాఖపై మంత్రి కొల్లు సమీక్ష

image

రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్‌ వేదికగా మంగళవారం అబ్కారీ, మధ్యపాన నిషేధ శాఖపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్‌, ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం, సమాజ సంక్షేమమే ధ్యేయంగా అబ్కారీ శాఖ పనిచేయాలని ఆదేశించారు. శాఖాపరమైన పనితీరులో పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు.