News March 31, 2025

MBNR: ‘అంబేడ్కర్ జాతర విజయవంతం కావాలి’

image

మహబూబ్‌నగర్ పట్టణంలోని ఎంబీసీ మైదానంలో నిర్వహించనున్న పూలే – అంబేడ్కర్ జాతర పోస్టర్‌ను మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. పూలే -అంబేడ్కర్ జాతర విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బోయపల్లి నర్సింహులు, వేంకట స్వామి, సామెల్, సిరసనోళ్ల బాలరాజు, గువ్వ లక్ష్మణ్ తదితరులున్నారు.

Similar News

News November 23, 2025

NZB: సాధారణ కార్యకర్త నుంచి DCC అధ్యక్షుడిగా..!

image

నిజామాబాద్ DCC అధ్యక్షుడిగా నగేష్ రెడ్డి నియమితులయ్యారు. మోపాల్‌(M) ముల్లంగికి చెందిన చెందిన ఆయన 1986లో TDPనుంచి సర్పంచ్‌గా పని చేశారు. 1995లో కాంగ్రెస్‌లో చేరి 2004వరకు మోపాల్ సింగిల్ విండో ఛైర్మన్‌గా, 2014 వరకు 5 సార్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా చేశారు. కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్త నుంచి అంచలంచెలుగా ఎదిగారు. 2023లో MLA టికెట్ ఆశించగా పార్టీ భూపతి రెడ్డికి టికెట్ ఖరారు చేసింది.

News November 23, 2025

నేడు పుట్టపర్తికి సీఎం రేవంత్ రెడ్డి

image

పుట్టపర్తిలో ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 8.45 గంటలకు హెలికాప్టర్లో పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో జరిగే బాబా శతజయంతి ఉత్సవాలకు హాజరు కానున్నారు. 11 గంటలకు సాయి కుల్వంత్ సభా మందిరంలో బాబా మహాసమాధి దర్శించుకుంటారు. 11.45 గంటలకు సత్యసాయి విమానాశ్రయం నుంచి తిరుగుపయనం అవుతారు.

News November 23, 2025

ప.గో: వందేళ్ల వేడుకకు వేళాయె..!

image

ప.గో జిల్లాలో ఈ నెల 23న శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం భీమవరంలో సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులతో ఆమె సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.