News February 12, 2025

MBNR: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

image

లక్ష్మీనారాయణ కంపౌండ్‌లో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నిన్న చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. జడ్చర్ల మండలం జయప్రకాశ్‌నగర్‌కు చెందిన శంకర్(33) ఇంటి నుంచి మేస్త్రీ పనికోసం బయలుదేరాడు. ఎప్పుడు.. ఎలా.. ఏం జరిగిందో తెలియదుకాని కాంపౌండ్ వద్ద రోడ్డుపై పడి మృతిచెందాడు. మృతుడికి మూర్ఛ వచ్చేదని, మద్యం తాగే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. శంకర్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కేసు నమోదైంది.

Similar News

News October 26, 2025

కరీంనగర్ మహాసభకు ‘తరలిన శ్రీనివాసులు’

image

చొప్పదండి మండలం నుంచి శ్రీనివాస నామదేయ మిత్రులు ఆదివారం పెద్దసంఖ్యలో KNRలో జరుగుతున్న తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వార్షికోత్సవ మహాసభకు తరలివెళ్లారు. కాగా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు ఈ సభకు వస్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. వార్షికోత్సవ మహాసభ సందర్భంగా తలసేమియా బాధితులకు రక్తదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం భవిష్యత్ కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

News October 26, 2025

మహిళల ఆరోగ్యానికి తోడ్పడే ప్రోబయోటిక్స్

image

ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడమే కాకుండా పలుఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తాయి. ముఖ్యంగా మహిళల్లో యూరినరీట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తాయంటున్నారు నిపుణులు. అలాగే పేగులోని అసమతుల్యతను సరిచేసి చర్మసమస్యలు తగ్గించడంలో, మూడ్ స్వింగ్స్, వెయిట్ మేనేజ్‌మెంట్‌లోనూ సాయపడతాయి. వీటికోసం పెరుగు, మజ్జిగ, ఇడ్లీ, దోసె, అరటి,యాపిల్​, ఉల్లి, వెల్లుల్లి తీసుకోవాలని సూచిస్తున్నారు.

News October 26, 2025

దిలావర్‌పూర్‌లో అత్యధికం

image

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 250.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. అత్యధికంగా దిలావర్‌పూర్ మండలంలో 62.2 మి.మీ., సారంగాపూర్‌లో 51.2 మి.మీ. వర్షం కురిసింది. రాబోయే 24 గంటల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.