News February 12, 2025

MBNR: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

image

లక్ష్మీనారాయణ కంపౌండ్‌లో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నిన్న చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. జడ్చర్ల మండలం జయప్రకాశ్‌నగర్‌కు చెందిన శంకర్(33) ఇంటి నుంచి మేస్త్రీ పనికోసం బయలుదేరాడు. ఎప్పుడు.. ఎలా.. ఏం జరిగిందో తెలియదుకాని కాంపౌండ్ వద్ద రోడ్డుపై పడి మృతిచెందాడు. మృతుడికి మూర్ఛ వచ్చేదని, మద్యం తాగే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. శంకర్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కేసు నమోదైంది.

Similar News

News November 16, 2025

IPL 2026 వేలానికి స్టార్ ప్లేయర్లు

image

వచ్చే IPL సీజన్ కోసం మొత్తం 10 ఫ్రాంచైజీలు రిటైన్డ్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాలను ప్రకటించాయి. దీంతో స్టార్ క్రికెటర్లు వేలానికి వచ్చారు. ఆండ్రీ రస్సెల్, గ్లెన్ మాక్స్‌వెల్ , లివింగ్‌స్టోన్ వంటి ప్లేయర్లు బిడ్డింగ్‌లో టార్గెట్ కానున్నారు. అదే విధంగా పతిరణతో పాటు జోష్ ఇంగ్లిస్, బిష్ణోయి, జంపా, డేవిడ్ మిల్లర్, వెంకటేశ్‌ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లు కూడా మినీ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.

News November 16, 2025

సంజయ్ ఎమ్మెల్యే పదవి ఉంటుందా? ఊడుతుందా?

image

పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల MLA సంజయ్ పై అసెంబ్లీలో విచారణ పూర్తైంది. స్పీకర్ తీసుకునే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. MLAపై వేటు పడుతుందా లేదా అనేదానిపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ జాప్యం చేస్తే పశ్చిమ బెంగాల్ MLA ముకుల్ రాయ్ సభ్యత్వాన్ని అక్కడి హైకోర్టు రద్దు చేసినట్లు ఇక్కడ కూడా ఆ పరిస్థితి లేకపోలేదని పొలిటికల్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.

News November 16, 2025

భర్త హత్యాయత్నం ఘటనలో భార్య మృతి

image

కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో అనుమానంతో ఎర్రిస్వామి తన భార్య రత్నమ్మను కత్తితో గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఈనెల 12న చోటుచేసుకుంది. రత్నమ్మను కుటుంబసభ్యులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.