News February 12, 2025
MBNR: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

లక్ష్మీనారాయణ కంపౌండ్లో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నిన్న చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. జడ్చర్ల మండలం జయప్రకాశ్నగర్కు చెందిన శంకర్(33) ఇంటి నుంచి మేస్త్రీ పనికోసం బయలుదేరాడు. ఎప్పుడు.. ఎలా.. ఏం జరిగిందో తెలియదుకాని కాంపౌండ్ వద్ద రోడ్డుపై పడి మృతిచెందాడు. మృతుడికి మూర్ఛ వచ్చేదని, మద్యం తాగే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. శంకర్కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కేసు నమోదైంది.
Similar News
News March 23, 2025
విదేశీ విద్య కోసం ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

విదేశాల్లో చదువుకునేందుకు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఎస్సీ సంక్షేమ అధికారి సుదర్శన్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. 2024 25 విద్యా సంవత్సరానికి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా 19.05.2025 లోపు telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 08542-220020 నెంబర్ పై సంప్రదించాలన్నారు. SHARE IT.
News March 23, 2025
పీఎం(జే.ఏ.ఎన్.ఏం.ఏ.ఎన్) పథకం కింద వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగ అవకాశాలు

పీఎం(జే.ఏ.ఎన్.ఏం.ఏ.ఎన్) పథకం కింద కాంట్రాక్టు ప్రాతిపదికన వైద్య ఆరోగ్యశాఖలో ఒక సంవత్సరం కాంట్రాక్టు పద్ధతిలో మెడికల్ ఆఫీసర్ (1), ల్యాబ్ టెక్నీషియన్ (1), పారామెడికల్ కం అసిస్టెంట్ పోస్టులు మొబైల్ మెడికల్ యూనిట్ లో పోస్టుల కోసం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కృష్ణ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈనెల 26న జిల్లా కలెక్టరేట్లో ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. SHARE IT.
News March 23, 2025
జడ్చర్ల: చికిత్స పొందుతూ.. యువకుడి మృతి

చికిత్స పొందుతూ.. యువకుడు మృతి చెందిన సంఘటన జడ్చర్ల పట్టణంలో జరిగింది. పోలీసుల వివరాలు.. పట్టణానికి చెందిన రవీంద్ర (26) శుక్రవారం కుటుంబ సభ్యులతో భూతగాదాలతో గొడవ పడి పారాసెటమాల్ మాత్రలను వేసుకున్నాడు. అనంతరం మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. శనివారం మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతో రవీంద్ర మరణించాడని, సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ఇజాజొద్దీన్ తెలిపారు.