News March 24, 2025

MBNR: అమిత్ షా వ్యాఖ్యలు క్షమించరానివి: ఎమ్మెల్యే

image

ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చారని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అంబేడ్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు క్షమించరానివన్నారు. 

Similar News

News November 18, 2025

కామారెడ్డి: వైద్యాధికారులకు శిశు స్వస్థ్యా శిక్షణ్ వర్క్ షాప్

image

కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లకు, పర్యవేక్షక సిబ్బందికి మంగళవారం శిశు స్వస్థ్యా శిక్షణ్ వర్క్ షాప్ నిర్వహించారు. నవజాత శిశు వారోత్సవాల్లో భాగంగా వైద్య సిబ్బందికి శిక్షణ అందించినట్లు GGH సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు తెలిపారు. శిశు మరణాల తగ్గించేందుకు, చిన్నపిల్లల్లో జబ్బులను గుర్తించేందుకు శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. RMO,POలు పాల్గొన్నారు.

News November 18, 2025

కామారెడ్డి: వైద్యాధికారులకు శిశు స్వస్థ్యా శిక్షణ్ వర్క్ షాప్

image

కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లకు, పర్యవేక్షక సిబ్బందికి మంగళవారం శిశు స్వస్థ్యా శిక్షణ్ వర్క్ షాప్ నిర్వహించారు. నవజాత శిశు వారోత్సవాల్లో భాగంగా వైద్య సిబ్బందికి శిక్షణ అందించినట్లు GGH సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు తెలిపారు. శిశు మరణాల తగ్గించేందుకు, చిన్నపిల్లల్లో జబ్బులను గుర్తించేందుకు శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. RMO,POలు పాల్గొన్నారు.

News November 18, 2025

కామారెడ్డి: ‘గణిత అధ్యాపకుడి కోసం దరఖాస్తు చేసుకోండి’

image

బిక్కనూర్ మండలం సిద్ధిరామేశ్వర్ నగర్ గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో పార్ట్ టైం ప్రాతిపాదికన గణిత శాస్త్రం బోధించేందుకు అర్హులైన వారు ఈనెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ రఘు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఎంపికైన అధ్యాపకుడికి రూ.23,400 వేతనం ఇస్తామని, అభ్యర్థులు MSC MATH B.ED/M.ED చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.