News November 10, 2024
MBNR: అరుణాచలానికి ప్రత్యేక బస్సులు.. ఫోన్ చేయండి.!

పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు MBNR, NRPT, NGKL, SDNR డిపోల నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి తెలిపారు. ఈనెల 13న ఆయా బస్ స్టేషన్ల నుంచి బయలుదేరుతాయని, రిజర్వేషన్ల కోసం MBNR-99592 26286, NGKL-99592 26288, NRPT-99592 26293, SDNR-99592 26287లకు సంప్రదించాలన్నారు. MBNRలోని బస్టాండ్లో రిజర్వేషన్ కౌంటర్లో తమ సీట్లను రిజర్వ్ చేసుకోవచ్చన్నారు.
Similar News
News October 29, 2025
మిడ్జిల్లో అత్యధిక వర్షపాత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మిడ్జిల్ మండల కేంద్రంలో 119.0 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. జడ్చర్ల 84.8, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 82.8, బాలానగర్ 68.0, నవాబుపేట మండలం కొల్లూరు 64.3, మూసాపేట మండలం జానంపేట 63.0, మహమ్మదాబాద్, రాజాపూర్ 53.0, భూత్పూర్ 41.5, మహబూబ్ నగర్ గ్రామీణం 43.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
News October 29, 2025
MBNR: భారీ వర్షాలు… పాఠశాలలకు నేడు సెలవు

మహబూబ్నగర్ జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేడు సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. భారీ వర్షం వల్ల నేటి ఎస్ఏ-1 (SA-1) పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.
News October 29, 2025
MBNR: ‘మొంథా’ నేపథ్యంలో వరి కోతలు నిలిపివేయాలి: ఏఈఓ

‘మొంథా’ తీవ్ర తుఫాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు వరి కోత పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఏఈఓ యన్. హర్షవర్ధన్ సూచించారు. తుఫాను పూర్తిగా తగ్గిన తర్వాతే కోతలు ప్రారంభించాలని కోరారు. వర్షం కారణంగా పంట నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, కోసిన ధాన్యం నిల్వలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఆయన రైతులకు తెలిపారు.


